AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రిమినల్ కేసులు పెడతాం.. సూర్య తండ్రి వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్

ప్రపంచ ప్రసిద్ది గాంచిన తిరుమల క్షేత్రంపై నటుడు సూర్య తండ్రి శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

క్రిమినల్ కేసులు పెడతాం.. సూర్య తండ్రి వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 08, 2020 | 11:09 AM

Share

ప్రపంచ ప్రసిద్ది గాంచిన తిరుమల క్షేత్రంపై నటుడు సూర్య తండ్రి శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఇప్పటికే కేసు కూడా నమోదైంది. కాగా శివ కుమార్‌ వ్యాఖ్యలపై తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఆక్షేపించదగినవని ఆయన అన్నారు. శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కేసు నమోదు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ వేగవంతం చేయమని ఆదేశించామని.. అందులో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవి కాదని తేలిందని అన్నారు. అయినా ఎప్పుడు చేసినా సరే అది కచ్చితంగా తప్పేనని.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు.

ఇక సప్తగిరి పత్రికలో కుసుడి కథనం వెనుక కుట్ర కోణం ఉందని.. ఈ వివాదంలో ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశామని అన్నారు. విచారణలో కుట్ర కోణం తేలితే వారిపైనా క్రిమినల్ కేసులు పెడతామని చెప్పుకొచ్చారు. కాగా ఆ మధ్యన తిరుమలపై మాట్లాడిన శివకుమార్.. తిరుమలలో డబ్బులున్న వారికే దర్శనాలు కల్పిస్తారని, గెస్ట్‌ హౌస్‌లు ఇస్తారని అన్నారు. కనీసం దర్శనం కూడా కల్పించకుండా సామాన్య భక్తులను తోసేస్తారని శివకుమార్‌ వాపోయారు. అలాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తమిళ్ మయ్యన్ అనే వ్యక్తి ఈ మెయిల్ ద్వారా టీటీడీకి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో శివకుమార్‌పై కేసు నమోదు చేశారు.

Read This Story Also: ఆ స్టార్ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ..!