AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

65 ఏళ్ల పినాకి మిశ్రాను రహస్యంగా పెళ్లాడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా!

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, బిజు జనతాదళ్ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను పెళ్లాడారు. జర్మనీలో రహస్యంగా వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. అయితే వివాహం గురించి వారిద్దరి నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. మహువా, పినాకి జర్మనీలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి ఫోటో కూడా బయటకు వచ్చింది.

65 ఏళ్ల పినాకి మిశ్రాను రహస్యంగా పెళ్లాడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా!
Mahua Moitra Married Pinaki Misra
Balaraju Goud
|

Updated on: Jun 05, 2025 | 3:34 PM

Share

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, బిజు జనతాదళ్ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను పెళ్లాడారు. జర్మనీలో రహస్యంగా వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. అయితే వివాహం గురించి వారిద్దరి నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. మహువా, పినాకి జర్మనీలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి ఫోటో కూడా బయటకు వచ్చింది.

‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం, మహువా-పినాకి జర్మనీలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు టిఎంసి నుండి ఎటువంటి స్పందన రాలేదు. మహువా తన రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది. మహువా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సెన్‌తో సంబంధం కొనసాగించారు. కానీ వారి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

మహువా మొయిత్రా రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణ నగర్ స్థానం నుండి ఆమె పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మహువా విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కళ్యాణ్ చౌబేను ఆమె ఓడించారు. మహువా అదే స్థానం నుండి రెండోసారి ఎన్నికయ్యారు. ఈసారి ఆమె బీజేపీ అభ్యర్థి అమృత రాయ్‌ను ఓడించారు.

మహువా మొయిత్రా మొదటి పదవీకాలం చాలా వివాదాస్పదమైంది. లోక్‌సభకు డబ్బులతో వచ్చారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ‘క్వరీకి నగదు’ కేసులో మహువా తీవ్రంగా చిక్కుకున్నారు. ఆమె లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడం జరిగింది. అయితే మహువా కూడా ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. పార్లమెంటు లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌ను తన స్నేహితురాలు హిరానందనితో పంచుకున్నట్లు కూడా మహువాపై ఆరోపణలు వచ్చాయి.

బిజు జనతాదళ్ నాయకుడు పినాకి మిశ్రా గురించి చెప్పాలంటే, ఆయన పూరీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. లోక్‌సభ డేటా ప్రకారం, పినాకి మొదట సంగీత మిశ్రాను వివాహం చేసుకున్నారు. పినాకి-సంగీత 1984 జనవరి 16న వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మహువాను పినాకి రహస్యంగా పెళ్లాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..