AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బియ్యం డబ్బాలో కంటికి కనిపించని విషం.. వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్న రెండేళ్ల చిన్నారి!

ముంబైలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఎలుకల నివారణ కోసం బియ్యంలో కలిపిన క్రిమిసంహారక మందు (Pesticide) వల్ల ఒక రెండేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. నిర్లక్ష్యంగా ఎలుకల మందు కలిపిన బియ్యంతో వండిన అన్నాన్ని తినడం వల్ల ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బియ్యం డబ్బాలో కంటికి కనిపించని విషం.. వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్న రెండేళ్ల చిన్నారి!
Mumbai Child Poisoning Case
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2026 | 8:41 PM

Share

ఇళ్లలో ఎలుకలు, బొద్దింకల నివారణకు మనం వాడే క్రిమిసంహారక మందుల (Pesticides) విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరించే ఒక అత్యంత విచారకరమైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎలుకలను చంపడానికి బియ్యంలో కలిపి ఉంచిన విషపూరితమైన రసాయనాన్ని గమనించకుండా, అదే బియ్యంతో అన్నం వండటంతో ఒక రెండేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. ఆ విషాహారం తిన్న బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూలో వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతోంది.

అసలేం జరిగింది?:

పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలోని ఒక కుటుంబంలో ఎలుకల ఉపద్రవం ఎక్కువగా ఉండటంతో, వాటిని నివారించడానికి ఇంట్లోని కొద్దిపాటి బియ్యంలో ఒక శక్తివంతమైన క్రిమిసంహారక పొడిని (ఎలుకల మందు) కలిపి ఒక పక్కన పెట్టారు. అయితే, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం లేదా పొరపాటు వల్ల ఆ విషం కలిపిన బియ్యాన్ని విడిగా ఉంచకుండా సాధారణ బియ్యంతో పాటే ఉంచేశారు. ఆ తర్వాత వంట చేసే సమయంలో ఆ తేడాను గమనించకుండా, ఆ విషపూరిత బియ్యంతోనే అన్నం వండేశారు.

ఆ అన్నాన్ని తిన్న కొద్దిసేపటికే రెండేళ్ల చిన్నారికి తీవ్రమైన వాంతులు, కడుపునొప్పి మొదలై స్పృహతప్పి పడిపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే రాత్రికి రాత్రే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. లోపలికి వెళ్లిన రసాయనం పసిపాప అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపడంతో వైద్యులు అత్యవసరంగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. వంటింట్లో మనం చేసే చిన్న పొరపాటు పసిప్రాణాల మీదకు తెస్తుందని చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఇలాంటి కెమికల్స్ వాడేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

వంటింట్లో పెస్ట్ కంట్రోల్ మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఇలాంటి ప్రమాదాలు ఏ ఇంట్లోనూ జరగకుండా ఉండాలంటే నిపుణులు ఈ క్రింది జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు:

ఆహార పదార్థాలకు దూరం: ఎలుకల మందు, బొద్దింకల స్ప్రేలు లేదా ఎలాంటి లార్వా నివారణ పొడులనైనా సరే వంటగదిలో, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు నిల్వ ఉంచే డబ్బాల పక్కన అస్సలు పెట్టకూడదు.

స్పష్టమైన లేబులింగ్: ఒకవేళ ఎలుకల కోసం ఏదైనా ఆహారంలో మందు కలిపితే, ఆ పాత్రపై లేదా కవర్‌పై స్పష్టమైన ప్రమాదకరమైన గుర్తు (డేంజర్ మార్క్) పెట్టాలి.

పిల్లలకు అందకుండా: చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఇలాంటి రసాయనాలను వారికి అస్సలు అందనంత ఎత్తులో లేదా లాక్ చేసిన క్యాబినెట్లలో ఉంచాలి.

ప్రొఫెషనల్ సహాయం: సొంతంగా మార్కెట్ నుండి తెచ్చిన విషపూరిత పొడులను వాడే కంటే, గుర్తింపు పొందిన పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ వారి సహాయం తీసుకోవడం సురక్షితం.

ఇంట్లో ఎవరైనా పొరపాటో, గ్రహపాటో కెమికల్స్ తింటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సొంత వైద్యాలు ప్రయత్నించకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us