AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thrissur ATM heist: ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు.. ఛేజింగ్‌లో ఒక నిందితుడు హతం.. ఆరుగురు అరెస్ట్

త్రిస్సూర్‌లో ఏటీఎం దోపిడీకి పాల్పడిన ముఠా వాహనాన్ని అడ్డగించినట్లు నమక్కల్ పోలీసులు ధృవీకరించారు. నిందితులు తమ కస్టడీలో ఉన్నారని నమక్కల్ పోలీసు ఉన్నత పోలీసు అధికారి తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను తమిళనాడులో న్యాయపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత త్రిసూర్‌కు  తరలించనున్నారు.  కంటైనర్‌లో పారిపోయేందుకు ప్రయత్నించిన ముఠాను పట్టుకున్నారు. కంటైనర్‌లో ఏటీఎం దోపిడీ సమయంలో ఉపయోగించిన కారు కూడా లభ్యమైంది.

Thrissur ATM heist: ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు.. ఛేజింగ్‌లో ఒక నిందితుడు హతం.. ఆరుగురు అరెస్ట్
Thrissur Atm Heist
Surya Kala
|

Updated on: Sep 27, 2024 | 7:28 PM

Share

తమిళనాడులోని నమక్కల్‌లో శుక్రవారం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక అనుమానితుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు తమిళనాడు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. ఈ ఘటన దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను అరెస్టు చేసే సమయంలో జరిగింది. ఈ ఘర్షణలో గాయపడిన కుమారపాళయం పోలీస్ ఇన్‌స్పెక్టర్ తవమణి, పల్లిపాళయం పోలీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ రంజిత్ ప్రస్తుతం పల్లిపాళయం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్రిస్సూర్‌లో ఏటీఎం దోపిడీకి పాల్పడిన ముఠా వాహనాన్ని అడ్డగించినట్లు నమక్కల్ పోలీసులు ధృవీకరించారు. నిందితులు తమ కస్టడీలో ఉన్నారని నమక్కల్ పోలీసు ఉన్నత పోలీసు అధికారి తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను తమిళనాడులో న్యాయపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత త్రిసూర్‌కు  తరలించనున్నారు.

కంటైనర్‌లో పారిపోయేందుకు ప్రయత్నించిన ముఠాను పట్టుకున్నారు. కంటైనర్‌లో ఏటీఎం దోపిడీ సమయంలో ఉపయోగించిన కారు కూడా లభ్యమైంది. తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని క్షుణ్ణంగా ప్రశ్నిస్తూ.. అరెస్టయిన వారు నిజంగానే ఏటీఎం దోపిడీ ముఠానా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Onmanorama (@onmanorama)

తమిళనాడులోని తిరువళ్లూరులో గతంలో నమోదైన కేసు మాదిరిగానే ఈ ముఠా పని తీరు ఉన్నట్లు గుర్తించారు. ATM కియోస్క్‌లను లక్ష్యంగా చేసుకుని కంటైనర్ ట్రక్కును ఉపయోగించారు. ఈ ముఠా ATMలను తెరిచేందుకు గ్యాస్ కట్టర్‌ను కూడా ఉపయోగించింది. కొన్ని సందర్భాల్లో ఏటీఎం యంత్రంతో సంఘటన స్థలం నుంచి పారిపోయి.. తరువాత ఏకాంత ప్రదేశంలో తెరస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, హైదరాబాద్‌లో జరిగిన ఏటీఎం చోరీల్లో ఈ ముఠా కోసం గాలిస్తున్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నమక్కల్ పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆధ్వర్యంలో నడిచే మూడు ఏటీఎంలను నలుగురు సభ్యుల ముఠా గ్యాస్ కట్టర్‌తో తెరిచి సుమారు రూ.65 లక్షలను ఎత్తుకెళ్లింది. తెల్లటి కారులో వచ్చిన ఈ ముఠా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి చెందిన ATMలు స్వరాజ్ రౌండ్ సమీపంలోని మాప్రాణం, కొలాజి, షోర్నూర్ రోడ్‌లో ఉన్న ఏటీఎంలు ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 2.30 నుంచి 4 గంటల మధ్య చోరీ జరిగింది. దోపిడీ దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు కారులో మూడు ప్రాంతాలకు వచ్చినట్లు గుర్తించారు. దోపిడీకి పాల్పడిన ముఠా ఏటీఎంలలో ఉన్న సీసీటీవీ కెమెరాలకు తమ దొంగ తనం రికార్డ్ కాకుండా స్ప్రే పెయింట్‌ వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..