Indian Railways: సాంకేతిక లోపంతో రివర్స్‌లో పరిగెత్తిన రైలు.. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌

Train Moves In Reverse: సాంకేతిక లోపంతో ఓ రైలు రివర్స్‌లో వెళ్లింది. అది కూడా దాదాపు 35 కిలోమీటర్లు.. దీంతో ఆ రైలులో ఉన్నవారంతా ఏం జరుగుతుందోనంటూ భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన

Indian Railways: సాంకేతిక లోపంతో రివర్స్‌లో పరిగెత్తిన రైలు.. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌
Train Moves In Reverse
Follow us

|

Updated on: Mar 19, 2021 | 3:28 PM

Train Moves In Reverse: సాంకేతిక లోపంతో ఓ రైలు రివర్స్‌లో వెళ్లింది. అది కూడా దాదాపు 35 కిలోమీటర్లు.. దీంతో ఆ రైలులో ఉన్నవారంతా ఏం జరుగుతుందోనంటూ భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్‌కు వెళ్లే పూర్ణగిరి జనశతాబ్డి ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో 35 కిలోమీటర్ల వరకు వెనుక్కి వెళ్లింది. చివరకు ఢిల్లీ నుంచి 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖతిమా వద్ద నిలిచి పోయింది. బుధవారం పూర్ణగిరి జనశతాబ్డి ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి తనక్‌పూర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో హఠాత్తుగా ట్రాక్‌పైకి పశువు రావడంతో దానిని తప్పించేందుకు లోకో పైలట్ సడెన్ బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది. అయితే పశువును ఢికొట్టిన తరువాత రైలు ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో లోకోపైలట్ రైలుపై నియంత్రణను కోల్పోవడంతో వెనక్కి ప్రయాణించింది. దీనికి సంబంధించి వెంటనే లోకో పైలెట్‌ అధికారులకు సమాచారమిచ్చాడు.

దీంతో తనక్‌పూర్ నుంచి ఖాతిమా వరకు అన్ని రైల్వే క్రాసింగ్‌లు మూసివేశారు. చివరకు చకర్‌పూర్ – ఖతిమా మధ్యనున్న గేట్ నంబర్ 35 వద్ద మట్టి, కంకరను అడ్డుపెట్టి రైలును ఆపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో రైలులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని, వారంతా క్షేమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఖతిమా నుంచి ప్రయాణికులను తనక్‌పూర్‌కు బస్సులో తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న యూపీలోని ఫిలిబిత్ నుంచి టెక్నికల్ బృందం అక్కడకు చేరుకుని విచారణ ప్రారంభించింది.

ఈ ఘటన అనంతరం రైల్వే అధికారులు ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీంతోపాటు ముగ్గురు సభ్యులతో కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:

Corona Cases and Lockdown News LIVE: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు.. మూడు నెలల్లో అత్యధిక పాజిటివ్ కేసులు

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?