AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తులకు చేదు వార్త.. గుళ్లో దర్శనం దక్కినప్పటికీ.. వాటికి మాత్రం చెక్?

సాధారణంగా గుడికి వెళ్తే.. దేవుడిని దర్శించుకున్నాక తీర్థం ఇచ్చి, శఠ గోపురం పెట్టి ప్రసాదాలు ఇస్తారు అర్చకులు. అవి తీసుకుంటే గానీ గుడికి వెళ్లొచ్చిన భావన ఉండదు. అయితే ఇప్పుడు వీటికి కూడా చెక్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నడిచేది కరోనా కాలం..

భక్తులకు చేదు వార్త.. గుళ్లో దర్శనం దక్కినప్పటికీ.. వాటికి మాత్రం చెక్?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 13, 2020 | 1:32 PM

Share

సాధారణంగా గుడికి వెళ్తే.. దేవుడిని దర్శించుకున్నాక తీర్థం ఇచ్చి, శఠ గోపురం పెట్టి ప్రసాదాలు ఇస్తారు అర్చకులు. అవి తీసుకుంటే గానీ గుడికి వెళ్లొచ్చిన భావన ఉండదు. అయితే ఇప్పుడు వీటికి కూడా చెక్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నడిచేది కరోనా కాలం కాబట్టి.. ఇక డైరెక్ట్‌గా దేవుడిని దర్శించుకుని వచ్చేటట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలోని అన్ని దేవాలయాలూ భక్తులకు దర్శనాలు కల్పించడం లేదు. దీంతో దాదాపు రెండు నెలలుగా దేవుడి దర్శనాలు కరువైపోయాయి. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కాశీ, తిరుమల, షిర్డీ, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు ఆలయ అధికారులు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ 3.0 ముగుస్తున్న నేపథ్యంలో ఆలయాల్లో భక్తులకు తిరిగి దర్శనాలు కల్పించే దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన ఆలయాలు తెరుచుకోనున్నాయి.

లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత దేవాలయాలు తెరిస్తే.. ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆలయానికి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ భక్తులు పలు నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్చకులు ఇచ్చే తీర్థం, ప్రసాదం, శఠారీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేదానిపై వారు తర్జనభర్జనలు పడుతున్నారట.

అందుకు కారణమేంటంటే.. కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది కాబట్టి.. ఒకరిపై పెట్టిన శఠ గోపురం.. మరొకరి తలపై పెట్టడం, ఇలాగే తీర్థప్రసాదాలు పెట్టడం సురక్షితమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో దేవాదాయ శాఖ కూడా ఆలయ అధికారులు, అర్చకులతో చర్చలు జరుపుతోందట. సో దీనిపై తొందరలోనే ఓ క్లారిటీ రానుంది. మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Read More:

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

అమెరికాలో కలకలం.. పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్.. 100 మంది పిల్లలు!

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!