తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 2.. మరి ఏపీ పరిస్థితి ఏంటి?

పట్టుమని పదేళ్లు కూడా లేని రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానంలో నిలిచింది. పూర్తిగా పట్టణ రాష్ట్రమైన ఢిల్లీ తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. ధనిక, పేద రాష్ట్రాలన గుర్తించేందుకు జీఎస్డీపీ, తలసరి ఆదాయం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. దేశానికి అత్యధికంగా స్థూల జాతీయోత్పత్తి (GDP) గడించి పెడుతున్న మహారాష్ట్ర, ధనిక రాష్ట్రాల జాబితాలో తొలి 5 స్థానాల్లో నిలవలేకపోయింది.

తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 2.. మరి ఏపీ పరిస్థితి ఏంటి?
Representative ImageImage Credit source: Getty Images
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 18, 2024 | 12:51 PM

పట్టుమని పదేళ్లు కూడా లేని రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానంలో నిలిచింది. పూర్తిగా పట్టణ రాష్ట్రమైన ఢిల్లీ తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. ధనిక, పేద రాష్ట్రాలన గుర్తించేందుకు జీఎస్డీపీ, తలసరి ఆదాయం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. దేశానికి అత్యధికంగా స్థూల జాతీయోత్పత్తి (GDP) గడించి పెడుతున్న మహారాష్ట్ర, ధనిక రాష్ట్రాల జాబితాలో తొలి 5 స్థానాల్లో నిలవలేకపోయింది. కానీ తొలి 5 స్థానాల్లో తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు చోటు సాధించి దక్షిణ భారతదేశ సామర్థ్యాన్ని చాటాయి. 1991 నాటికి తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే దక్షిణాది రాష్ట్రాల సగటు చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మూడు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలుగా నిలిచాయి. ఆ దశాబ్దం ప్రారంభంలో చేపట్టిన ఆర్థిక సరళీకృత విధానాలను దక్షిణాది రాష్ట్రాలను అందిపుచ్చుకుని శరవేగంగా దూసుకెళ్లాయి. ఫలితంగా ఒకప్పుడు వెనుకబాటుతనంలో మగ్గిపోయిన రాష్ట్రాలు 2-3 దశాబ్దాల్లో అనూహ్య పురోగతి సాధించాయి.

దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలన్నీ తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాలుగా లేకపోవచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ (PMEAC) ప్రకారం మాత్రం ఈ ఐదు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలే. దేశ జీడీపీలో ఈ 5 రాష్ట్రాల వాటా మార్చి, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 30% గా నమోదైంది. దక్షిణాదికి ఆనుకుని ఉన్న మధ్య, పశ్చిమ రాష్ట్రం మహారాష్ట్ర ఇప్పటికీ అత్యధిక జీడీపీ అందిస్తున్న రాష్ట్రంగా నిలిచినప్పటికీ.. గత దశాబ్దన్నర కాలంగా 15% వాటా కలిగిన ఈ రాష్ట్రం ఇప్పుడు 13.3%కు పరిమితమైంది. దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై మహానగరమే అత్యధిక జీడీపీకి కారణం. అనేక కార్పొరేట్ సంస్థలు ముంబై కేంద్రంగా తమ వ్యాపార కార్యాకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ఎంపీ స్థానాల ప్రకారం 2వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర, తలసరి ఆదాయం గణాంకాల్లో మాత్రం తొలి 5 స్థానాల్లో నిలవలేకపోయింది.

ధనిక రాష్ట్రాల కొలమానం ఏంటి?

ధనిక రాష్ట్రాల కొలమానంలో జీడీపీ, తలసరి ఆదాయం వంటివి కీలక పారామీటర్స్‌గా చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం జాతీయ సగటు కంటే ఏ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది? అది ఎంత శాతం ఎక్కువగా ఉంది? అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటూ జాబితా రూపొందించగా.. 250.18%తో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. 1960-61లో ఈ రాష్ట్రం 218.3% కలిగి ఉండగా, కొన్ని దశాబ్దాల్లో అది మరింత పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో 193.6% శాతంతో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 100% అంటేనే జాతీయ సగటు కంటే రెట్టింపు అని అర్థం. అలాంటి రెండు, రెండున్నర రెట్ల అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నందుకు ధనిక రాష్ట్రాల జాబితాలో చోటు సంపాదించాయి. ఢిల్లీ, తెలంగాణ తర్వాత కర్ణాటక (180.7%), హర్యానా (176.8%), తమిళనాడు (171.1%)తో మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచాయి. ఇందులో కర్ణాటక 1960-61లో 96.7% అధిక తలసరి ఆదాయం కలిగి ఉండగా.. అదిప్పుడు రెట్టింపు అయింది. అత్యధిక జీడీపీ వాటా కల్గిన మహారాష్ట్ర సైతం 63 ఏళ్ల క్రితం ఉన్న 133.7% నుంచి 150.7% తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది.

పేద రాష్ట్రాలు ఇవే…

తలసరి ఆదాయం ప్రకారం పేద రాష్ట్రాల జాబితాలో వరుసగా బిహార్ (32.8%), జార్ఖండ్ (57.2%), ఉత్తర్ ప్రదేశ్ (50.8%), మణిపూర్ (66%), అస్సాం (73.7%) నిలిచాయి. ఇందులో యూపీ, బిహార్ అత్యధిక జనాభ, జనసాంద్రత కల్గిన రాష్ట్రాలు. 1960-61లో జీడీపీలో యూపీ వాటా 14% ఉండగా, అదిప్పుడు 9.5 శాతానికి పడిపోయింది. జనాభా ప్రకారం యూపీ, మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఉన్న బిహార్ జీడీపీలో కేవలం 4.3% వాటా మాత్రమే కలిగి ఉంది.

1960లలో మొదలైన హరిత ఉద్యమం (గ్రీన్ రివల్యూషన్) కారణంగా పంజాబ్ రాష్ట్రం అత్యధికంగా లాభపడింది. ఆ రాష్ట్రంలో జాతీయ సగటు తలసరి ఆదాయంతో పోల్చితే 119.6%గా ఉన్న తలసరి ఆదాయం 1971 నాటికి 169% శాతానికి పెరిగింది. వ్యవసాయం ద్వారా లబ్ది పొందిన ఈ రాష్ట్రం ఇప్పటికీ 106%తో జాతీయ సగటుతో పోల్చితే రెట్టింపు ఆదాయాన్ని కలిగి ఉంది. అటు పంజాబ్‌కు, ఇటు ఢిల్లీకి మధ్యలో ఉన్న హర్యానాలో ఢిల్లీని ఆనుకుని అభివృద్ధి చెందిన గురుగ్రాం కారణంగా తలసరి ఆదాయం గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. అందుకే ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల తర్వాత 4వ స్థానం సంపాదించగలిగింది.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి?

దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కూడా ధనిక రాష్ట్రమే అయిప్పటికీ తలసరి ఆదాయం గణాంకాల్లో తొలి 5 స్థానాల్లో చోటు సంపాదించలేకపోయింది. ఇందుకు కారణంగా అత్యధిక ఆదాయం గడించి పెడుతున్న హైదరాబాద్ వంటి మహానగరం లేకపోవడమేనని ఆ రాష్ట్ర పాలకులు చెబుతుంటారు. అయినప్పటికీ జీడీపీలో 9వ స్థానం, తలసరి ఆదాయం గణాంకాల ప్రకారం 16వ స్థానంలో నిలిచింది. 2019 – 2024 మధ్యకాలంలో 888 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలిగింది. అయితే పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ మాత్రం ఈ ఐదేళ్ల కాలంలో ఏకంగా 7.77 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోగలిగింది.

భారతదేశ తూర్పు ముఖద్వారం (ఈస్టర్న్ గేట్‌వే ఆఫ్ ఇండియా)గా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే పొడవైన తీర రేఖ కల్గిన రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది. అనేక ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. జీడీపీలో తన వాటా క్రమక్రమంగా పెంచుకుంటూ ముందుకెళ్తోంది. జీడీపీలో ఇప్పటికీ వ్యవసాయమే అత్యధిక వాటా కలిగి ఉన్నప్పటికీ దాంతో పాటు జౌళి, ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులను ఆకట్టుకుంటూ వేగంగా పురోగతి పథంలో దూసుకెళ్తోంది.

తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 2.. మరి ఏపీ?
తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 2.. మరి ఏపీ?
'మ్యాడ్' బాయ్స్ మళ్లీ వస్తున్నారు.. పట్టు బట్టల్లో అదరగొట్టారుగా
'మ్యాడ్' బాయ్స్ మళ్లీ వస్తున్నారు.. పట్టు బట్టల్లో అదరగొట్టారుగా
భోజనం చేసిన కాసేపటికే మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా?
భోజనం చేసిన కాసేపటికే మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా?
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పెద్దిరెడ్డి పుంగనూరులో పోటీ చేయరా? మిధున్ రెడ్డి కీలక వ్యాఖలు
పెద్దిరెడ్డి పుంగనూరులో పోటీ చేయరా? మిధున్ రెడ్డి కీలక వ్యాఖలు
ఒంగోలులోని శ్రీహర్షిణి జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్ధిని సూసైడ్
ఒంగోలులోని శ్రీహర్షిణి జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్ధిని సూసైడ్
బిగ్ బాస్ తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా: శేఖర్ బాషా
బిగ్ బాస్ తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా: శేఖర్ బాషా
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
ఈ ముగ్గురు SRH ప్లేయర్లు మెగా వేలంలోకి వస్తే ఇక దబిడి దిబిడే..!
ఈ ముగ్గురు SRH ప్లేయర్లు మెగా వేలంలోకి వస్తే ఇక దబిడి దిబిడే..!
ప్రశాంతంగా నిద్రపోవాలా.. ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి
ప్రశాంతంగా నిద్రపోవాలా.. ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
పేషెంట్ ఉండాల్సిన అంబులెన్స్‌లో ఏముందో తెలుసా ??
పేషెంట్ ఉండాల్సిన అంబులెన్స్‌లో ఏముందో తెలుసా ??