AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచిన టీవీకే అధినేత విజయ్.. పార్టీ సంస్థాగతంపై దృష్టి..!

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులోనూ ఇటీవల పార్టీని ఏర్పాటు చేసిన నటుడు విజయ్ మరింత స్పీడ్ పెంచారు. పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాల కోసం కమిటీలను నియామకం జరిగింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచిన టీవీకే అధినేత విజయ్.. పార్టీ సంస్థాగతంపై దృష్టి..!
Tvk Party Chief Actor Vijay
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 12, 2025 | 7:57 PM

Share

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులోనూ ఇటీవల పార్టీని ఏర్పాటు చేసిన నటుడు విజయ్ మరింత స్పీడ్ పెంచారు. పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాల కోసం కమిటీలను నియామకం జరిగింది. తమిళనాట డీఎంకే పార్టీకి తానే ప్రత్యామ్నాయం అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎండీఎంకే పార్టీకి బలంగా ఉన్న కొంగు మండలం ప్రాంతంలో పాగా వేసి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.

తమిళనాడులో 2026 తొలి త్రైమాసికంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలే ఉండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఇప్పటిదాకా తమిళనాడులో డీఎంకే, ఏడిఎంకె పార్టీలే మార్చి.. మార్చి అధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. ఇటీవల నటుడు విజయ్ సొంత పార్టీని ఏర్పాటు చేసి ఈసారి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. గత మూడు నెలలుగా శని ఆదివారాలు ప్రజల్లోకి వెళ్లేందుకు వీకెండ్ టూర్ ఏర్పాటు చేసుకున్న విజయ్ ఆ దిశగా వరుస సభలు నిర్వహించారు. అయితే కరూర్ లో తొక్కిసలాటలు 41 మంది మృతి చెందడంతో సభలకు ఇచ్చే అనుమతి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో టీవీకె పార్టీ స్పీడ్ కాస్త తగ్గింది..

అయితే ప్రధాన పార్టీల నుంచి సీనియర్ లీడర్లను తమ వైపు తిప్పుకోవడంలో విజయ్ బాగా సక్సెస్ అయ్యారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాడీఎంకెలో సీనియర్ గా ఉన్న మాజీమంత్రి సెంగోట్టియన్, మరో సీనియర్ నేత నాంజల్ సంపత్ సహా పలువురు విజయ్ పార్టీలో చేరారు. ఎఐడీఎంకే నుంచి మరికొందరు సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి వెళ్ళేందుకు మరింత వ్యూహాత్మకంగా విజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తాజాగా చెన్నైలోని పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, కూటమి ఏర్పాటులో ఏఏ పార్టీ ఉండాలి అన్న అంశంపై నిర్ణయాలు.. ఎన్నికల మేనిఫెస్టో లో ఏ ఏ అంశాలు ఉండాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీలు వాటికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేయనున్నాయి. విజయ్ సీఎం అభ్యర్థిగా అంగీకరించే పార్టీలతోనే పొత్తు ఉంటుందని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో తమ మేనిఫెస్టో లో ఉండాల్సిన అంశాల పై కమిటీ నివేదిక రూపొందించాలని విజయ్ సూచించినట్లు సమాచారం. ప్రచార కార్యక్రమాలు సభల విషయంలో అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది..

ఇఖ విజయ్ తమిళనాడులో డీఎంకే పార్టీకి కూడా సాధ్యం కానీ కొంగు మండలంలో పట్టు ఏడీఎంకే పార్టీకి ఉంది.. అలాంటి చోట పట్టు సాధించడం కోసం అక్కడ బలమైన నాయకుడు మాజీ సీఎం పలనీ స్వామి సామాజిక వర్గానికి చెందిన సెంగోటియన్ ను పార్టీలోకి చేర్చుకున్నారు విజయ్. సంస్థాగతంగా పార్టీ బలపడాలంటే పార్టీలో అనుభవం ఉన్న ఇలాంటి సీనియర్లు ఉండాలని భావించిన విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒక్కో సీనియర్ నేతను తన పార్టీలోకి చేర్చుకుని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళుతున్నారు. మరోవైపు ఏడిఎంకె బీజేపీ కోటమిలోకి విజయ్ ను తీసుకురావాలని ఆ రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నించినా అది కుదరలేదు. తీరా ఏడీఎంకెలోని బలమైన నేతాలని తన వైపు లాక్కుని అన్నాడీఎంకే కోలుకోవాలని దెబ్బ తగిలేలా చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..