AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మో బాబోయ్.. ఆడాడు, గెలిచాడు..లక్షాధికారయ్యాడు

బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రానికి వలస వెళ్లిన ఓ యువకుడిని అదృష్టం కలిసొచ్చింది. క్రికెట్‌ గేమింగ్‌ యాప్‌తో రాత్రికి రాత్రే ఒక్కసారిగా లక్షాధికారిగా మారిపోయాడు.

అమ్మో బాబోయ్.. ఆడాడు, గెలిచాడు..లక్షాధికారయ్యాడు
Business Idea
Aravind B
|

Updated on: Mar 23, 2023 | 11:32 AM

Share

బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రానికి వలస వెళ్లిన ఓ యువకుడిని అదృష్టం కలిసొచ్చింది. క్రికెట్‌ గేమింగ్‌ యాప్‌తో రాత్రికి రాత్రే ఒక్కసారిగా లక్షాధికారిగా మారిపోయాడు. ఝార్ఖండ్‌కు చెందిన సుశీల్‌కుమార్‌ జీవనోపాధి కోసం 15 ఏళ్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లా పాంగి ప్రాంతానికి వలస వెళ్లాడు. అయితే అక్కడి రాష్ట్ర విద్యుత్తుబోర్డులో నాలుగో తరగతి ఉద్యోగిగా పని చేస్తున్నాడు. తన సోదరుడితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సుశీల్ కుమార్ గత ఏడాదిన్నర కాలంగా డ్రీమ్ 11 గేమింగ్ యాప్ లో చురుకుగా ఉన్నాడు. ప్రతిసారి తన అదృష్టాన్ని పరిక్షించుకుంటూ ఉండేవాడు. అయితే తాజాగా ఆడిన ఓ గేమ్ అతని జీవితాన్నే మార్చేసింది. ఈ గేమ్ లో సుశిల్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. తాను ఈ పెద్ద మొత్తం గెలిచేకన్నా ముందు ఆ సమయంలో దాదాపు 35 లక్షల మంది ఈ ఆట ఆడుతున్నారని సుశీల్‌ చెప్పాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే కచ్చితమైన అంచనా వేయడం ద్వారానే ఇంత భారీ మొత్తాన్ని గెలుచుకున్నట్లు సుశీల్‌ తెలిపాడు. పన్ను మినహాయింపులు పోగా సుశీల్‌ చేతికి రూ.70 లక్షలు రానున్నాయి.

NOTE: ఈ కథనం పాఠకుల ఆసక్తి మేరకే ప్రచూరించడం జరిగింది. టీవీ9 ఆన్ లైన్ గేమింగ్ లను ప్రోత్సహించదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..