AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ కేసులో ‘మహా’ సీఎంపై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ఫైర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ నిప్పులు చెరిగారు. ఈ కేసుతో ప్రమేయమున్నవారిని కాపాడాలంటూ బాలీవుడ్ మాఫియా నుంచి ఉధ్ధవ్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతో బాలీవుడ్ మాఫియా చెలరేగిపోతోందని, పోలీసులు కూడా నిస్సహాయులయ్యారని ఆయన అన్నారు. ఈ మాఫియా కారణంగానే ఉధ్ధవ్ థాక్రే.. సుశాంత్ మృతికి కారకులైనవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని సుశీల్ మోడీ అన్నారు. అలాగే […]

సుశాంత్ కేసులో 'మహా' సీఎంపై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ఫైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 02, 2020 | 3:53 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ నిప్పులు చెరిగారు. ఈ కేసుతో ప్రమేయమున్నవారిని కాపాడాలంటూ బాలీవుడ్ మాఫియా నుంచి ఉధ్ధవ్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతో బాలీవుడ్ మాఫియా చెలరేగిపోతోందని, పోలీసులు కూడా నిస్సహాయులయ్యారని ఆయన అన్నారు. ఈ మాఫియా కారణంగానే ఉధ్ధవ్ థాక్రే.. సుశాంత్ మృతికి కారకులైనవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని సుశీల్ మోడీ అన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నిస్పాక్షిక దర్యాప్తు చేయనున్న బీహార్ పోలీసులను ముంబై పోలీసులు అడ్డుకుంటున్నారని కూడా ఆయన విమర్శించారు.

ఇలా ఉండగా పాట్నా నుంచి ఓ ప్రత్యేక పోలీసు బృందం ఆదివారం ముంబై బయల్దేరింది. ఈ బృందం సుశాంత్ మృతికి దారి తీసిన పరిస్థితులను, ఫోరెన్సిక్ రిపోర్టులను పరిశీలించి తమకు  తాము స్వతంత్ర దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా-తమ నగర పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి లోపమూ లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ ఇదివరకే ప్రకటించారు.