కాంగ్రెస్ కీచులాటల్లో మరో ‘పర్వం’, ఆనంద్ శర్మ, అధిర్ రంజన్ చౌదరి మధ్య ;ఇన్ సైడ్ ఫైటింగ్’
కాంగ్రెస్ పార్టలో కొత్త 'కీచులాటలపర్వం' మొదలైంది. ఇప్పటివరకు పార్టీ అధినాయకత్వంపై దాదాపు విరుచుకుపడుతూ నాయకత్వానికి బాహాటంగా లేఖ రాసిన 23 మంది నేతల వ్యవహారం ఒకటైతే...
కాంగ్రెస్ పార్టలో కొత్త ‘కీచులాటలపర్వం’ మొదలైంది. ఇప్పటివరకు పార్టీ అధినాయకత్వంపై దాదాపు విరుచుకుపడుతూ నాయకత్వానికి బాహాటంగా లేఖ రాసిన 23 మంది నేతల వ్యవహారం ఒకటైతే.. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ బయటపడి పార్టీని మళ్ళీ రచ్ఛకీడ్చింది. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి, మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ మధ్య వివాదం తలెత్తింది. ఈ ఎన్నికల్లో ముస్లిం నేత అబ్బాస్ సిద్దిఖీ నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తో పొత్తు పెట్టుకోవాలన్న అధిర్ రంజన్ నిర్ణయాన్ని ఆనంద్ శర్మ తప్పు పట్టారు. అది మతతత్వ పార్టీ అని, దానితో పొత్తేమిటని ఆయన ప్రశ్నించారు. ఓ వైపు మత తత్వ పార్టీగా ముద్ర పడిన బీజేపీని ఎదుర్కోవాలని మనం భావిస్తుంటే ఇదే పోకడ గల మరో సంస్థతో చేతులు కలుపుతారా అన్నారాయన. దీనిపై అధిర్ రంజన్ మండిపడ్డారు. ఈ పేరున్న గొప్ప నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనబెట్టి. ఎదగాలని, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించే పాటలు పాడడం, సమయాన్ని వృధా చేయడం మానుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. తమకు ఇన్నేళ్ళుగా బాసటగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత వీరిపై ఉందన్నారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యంగా ఆనంద్ శర్మను, గులాం నబీ ఆజాద్ ను ప్రస్తావించారు. మోదీ వంటి నాయకులు ఉండడం మనకు గర్వ కారణమని ఆజాద్ అదేపనిగా ఆయనను ఆకాశానికెత్తేశారు. బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ…. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ లో భాగమని, బీజేపీని ఓడించాలన్నదే దీని ధ్యేయమని అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. అటు బీజేపీ ఈ ధోరణిపై వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. వీళ్ళ మధ్య కీచులాటల నేపథ్యంలో ఇది తమకే మంచిదని, బెంగాల్ ఎన్నికల్లో ఇది తమకే ప్రయోజనకరమని బీజేపీ భావిస్తోందని అంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :