AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ ‘పోరుబాట’……..24 న సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ….

దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు....కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహాన్ని రూపొందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నెల 24 న ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ 'పోరుబాట'........24 న సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ....
Sonia Gandhi
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 21, 2021 | 9:11 PM

Share

దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు….కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహాన్ని రూపొందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నెల 24 న ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ శాఖల ఇన్-చార్జులు ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు. వర్చ్యువల్ గా జరిగే ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపైనా…కోవిద్ అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నేతలు తమతమ సూచనలను, సలహాలను ఇవ్వనున్నట్టు తెలిసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల, మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంతో బాటు కోవిద్ పరిస్థితిని ప్రభుత్వం హ్యాండిల్ చేస్తున్న వైనంకూడా ఈ మీటింగ్ లో చర్చకు రావచ్చు. క్షీణిస్తున్న దేశ ఎకానమీ, ప్రజలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళను నేతలు ప్రస్తావిస్తారని అంటున్నారు. అలాగే పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సైతం కొందరు సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను వివరించే ప్రయత్నం చేయవచ్చు.

ఇప్పటికే కపిల్ సిబల్, జైరాం రమేష్ వంటి సీనియర్ నేతలు పార్టీ తీరుపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి వారి అభిప్రాయాలను ఈ సమావేశం పరిగణనలోకి తీసుకుంటుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా ఎన్సీపీ నేత శరద్ పవార్ అధ్యక్షతన మంగళవారం జరిగే విపక్ష పార్టీల సమావేశ పర్యవసాన్ని కాంగ్రెస్ నేతలు మదింపు చేయవచ్చునని భావిస్తున్నారు జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్ హైకమాండ్ ఈ మీటింగ్ నిర్వహించడం విశేషం. కాగా వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ ఓటమిపై మాత్రం సమగ్రమైన సమీక్ష జరగడంలేదన్నది వాస్తవమని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: దళితుల వ్యతిరేకి బీహార్ సీఎం నితీష్ కుమార్…..చిరాగ్ పాశ్వాన్ ఫైర్….అసలు స్వరూపం బయటపెడతానని వార్నింగ్

Skin Care : మోచేతులు, మోకాళ్ల దగ్గర నల్లగా ఉందా..! అయితే ఈ 6 మార్గాల ద్వారా వదిలించుకోండి..

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై హెవీరష్.. ట్రాఫిక్ డైవర్షన్ రూట్ ఇదిగో
విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై హెవీరష్.. ట్రాఫిక్ డైవర్షన్ రూట్ ఇదిగో
అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే
అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే