Sikkim Rains: సిక్కింలో వర్షాలు బీభత్సం.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి, ముగ్గురు గల్లంతు..

సిక్కింలో శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ప్రజలతో కలిసి సహాయక చర్యలు ప్రారంభించింది. భారీ వర్షాల కారణంగా పర్వతాలు పగుళ్లు వస్తున్నాయి. పశ్చిమ సిక్కింలోని యాంగ్‌తాంగ్ నియోజకవర్గంలోని ఎగువ రింబిలో కొండచరియలు విరిగిపడటంతో, శిథిలాలు, రాళ్ళు హ్యూమ్ నదిలోకి పడ్డాయి. ఈ కారణంతో నదిలోని నీరు పొంగి ప్రవహిస్తోంది.

Sikkim Rains: సిక్కింలో వర్షాలు బీభత్సం.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి, ముగ్గురు గల్లంతు..
Sikkim Landslide
Image Credit source: ANI

Updated on: Sep 12, 2025 | 10:45 AM

ప్రకృతి మనుషులపై పగబట్టింది. ముఖ్యంగా పర్వత సానువుల్లో నివసిస్తున్న ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కొండ ప్రాంతాల సమీపంలోని రాష్ట్రాలలో మేఘ విస్పోటనం, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు శుక్రవారం తెల్లవారుజామున సిక్కింలో కొండచరియలు విరిగిపడిన సంఘటన జరిగింది. ఈ ఘటనలో 4 మంది మరణించారు, ముగ్గురు వ్యక్తుల జాడ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసులు స్థానిక ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.

పశ్చిమ సిక్కింలోని యాంగ్తాంగ్ నియోజకవర్గంలోని అప్పర్ రింబిలో కొండచరియలు విరిగిపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. స్థానిక గ్రామస్తులు, ఎస్‌ఎస్‌బి జవాన్లతో కలిసి పోలీసు బృందం వరద నీటితో ఉప్పొంగుతున్న హ్యూమ్ నదిపై చెట్ల దుంగలతో తాత్కాలిక వంతెనను నిర్మించి, ప్రభావిత ప్రాంతం నుంచి ప్రజలను తరలించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో వారు ఇద్దరు మహిళలను రక్షించడంలో కూడా విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి

చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి
ఈ సంఘటన గురించి ఎస్పీ గెజింగ్ షెరింగ్ షెర్పా మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారని.. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారని, ఇద్దరు మహిళలను నది నుంచి రక్షించిన తర్వాత వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించామని.. అయితే ఒక మహిళ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించిందని తెలిపారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాదు ముగ్గురు వ్యక్తులు ఇంకా కనిపించడం లేదని సమాచారం.

హ్యూమ్ నది ఉప్పొంగడంతో ఇళ్లలోకి నీరు
దీనితో పాటు భారీ వర్షాల కారణంగా పర్వతాలు పగుళ్లు ఏర్పడి భారీ కొండచరియలు విరిగిపడ్డాయని ఎస్పీ గెజింగ్ షెరింగ్ షెర్పా తెలిపారు. దీని తరువాత శిధిలాలు, రాళ్ళు నీటితో నదిలోకి వచ్చాయి, దీని కారణంగా హ్యూమ్ నది ఉప్పొంగింది. అటువంటి పరిస్థితిలో.. నది నీటి ప్రవాహం పెరిగి.. సమీపంలోని ఇల్లు కొట్టుకుపోయాయి. గత రెండు రోజులుగా సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజుల పాటు సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

సెప్టెంబర్ 17 వరకు భారీ వర్ష హెచ్చరిక
సెప్టెంబర్ 17 వరకు సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ, హ్యూమ్ నదితో పాటు, ఇతర నదులు కూడా భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పర్వతాలలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వరకు, పర్వత ప్రాంతాలలో ఇప్పటివరకు ఇటువంటి అనేక సంఘటనలు నమోదయ్యాయి, వీటిలో వందలాది మంది మరణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..