మోదీ స్వరాష్ట్రంలో కుల వివక్ష.. దళిత టీచర్‌కు అవమానం

కులం.. ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న భూతం. ఈ కులజాఢ్యం ప్రస్తుతం దేశంలో మరింత పెరిగిపోతోంది. ఇటీవల అగ్రవర్ణాల భూమి నుంచి దళితుడి శవం కూడా పొవడానికి వీల్లేదంటూ తమిళనాడులో జరిగిన కుల దుశ్చర్య మరిచిపోకముందే.. మరో కుల వివక్ష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మరెక్కడో కాదండోయ్.. సాక్షాత్తు మన దేశ ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌లో.. చాయ్ వాలా నుంచి ప్రధానిగా ఎదిగానని మన మోదీ చెప్తుంటారు. అంతేకాదు ఆ రాష్ట్రానికి సీఎంగా కూడా […]

మోదీ స్వరాష్ట్రంలో కుల వివక్ష.. దళిత టీచర్‌కు అవమానం
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 6:11 PM

కులం.. ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న భూతం. ఈ కులజాఢ్యం ప్రస్తుతం దేశంలో మరింత పెరిగిపోతోంది. ఇటీవల అగ్రవర్ణాల భూమి నుంచి దళితుడి శవం కూడా పొవడానికి వీల్లేదంటూ తమిళనాడులో జరిగిన కుల దుశ్చర్య మరిచిపోకముందే.. మరో కుల వివక్ష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మరెక్కడో కాదండోయ్.. సాక్షాత్తు మన దేశ ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌లో.. చాయ్ వాలా నుంచి ప్రధానిగా ఎదిగానని మన మోదీ చెప్తుంటారు. అంతేకాదు ఆ రాష్ట్రానికి సీఎంగా కూడా చాలా ఏళ్లు వ్యవహరించారు. దేశానికి రోల్ మోడల్ గుజరాత్ అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే అక్కడ ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే షాక్ తినాల్సిందే. ఎవరైన విద్యార్ధులు కుల వివక్ష గురించి ప్రస్తావిస్తే.. అది తప్పూ అని గురువు చెప్పాలి. మరి ఆ గురువే కుల వివక్షకు గురైతే ఎవరికి చెప్పాలి. ఇలాంటి ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో ఓ దళిత టీచర్‌కు ఎదురైంది.

సురేంద్రనగర్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో రెండు మంచి నీటి కుండలను ఏర్పాటు చేయించాడు ప్రధానోపాధ్యాయుడు. అందులో ఒకటి అగ్ర కులాలకు చెందిన టీచర్లకు, మరొకటి దళిత టీచర్‌కు. అయితే పొరపాటున దళిత టీచర్‌.. అగ్ర కులాలకు ఏర్పాటు చేయించిన మంచి నీటి కుండను ముట్టుకున్నారు. దీంతో ఆ ప్రధానోపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సదరు ఉపాధ్యాయుడిపై మండిపడ్డారు. అయితే ఈ ఘటనపై ఆ బాధిత టీచర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం పాఠశాలలో రెండు మంచినీటి కుండలు ఏర్పాటు చేశారని, ఒకటి అగ్రవర్ణాలకు, మరొకటి ఇతరులకు కేటాయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను పొరపాటున అగ్రవర్ణాలకు చెందిన కుండలోని నీటిని తాగానని, దీంతో తనకు హెచ్ఎం నోటీసు జారీ చేశారన్నారు. కాగా ఈ ఘటన జరిగిన తరువాత ఆ భాధిత ఉపాధ్యాయుడిని వేరొక పాఠశాలకు బదిలీ చేయడం గమనార్హం. అగ్రదేశాలతో పోటీపడుతున్నామనుకుంటున్న తరుణంలో ఇలాంటి అనాగరిక చర్యలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు