AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో ఆగస్ట్‌ 30న పాఠశాలలు బంద్‌.. వరుసగా 2 రోజులు సెలవులు

School Holiday: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్ట్ 30న పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కళాశాలలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని జిల్లా విద్యా అధికారిని ఆదేశించారు కలెక్టర్లు..

School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో ఆగస్ట్‌ 30న పాఠశాలలు బంద్‌.. వరుసగా 2 రోజులు సెలవులు
Subhash Goud
|

Updated on: Aug 29, 2025 | 5:20 PM

Share

School Holiday Tomorrow: విద్యా సంస్థలకు ఆగస్ట్‌ నెలలో చాలా సెలవులు వచ్చాయి. ఇక దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వర్షాలతో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో రేపు అంటే ఆగస్ట్‌ 30వ తేదీన ఆ రాష్ట్రంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. రుతుపవనాల ఉధృతితో అనేక రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి పాఠశాలలు, కళాశాలలు వంటి విద్యా సంస్థలు కొన్ని రోజులు మూసివేశారు. ఆగస్టు 30, 2025న, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనేక రాష్ట్రాలు తమ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించుకున్నాయి. తెలంగాణ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. రుతుపవనాల వల్ల రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక్కడ రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తమ ప్రైవేట్, ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశించాయి.

పంజాబ్‌లో రేపు పాఠశాలలకు సెలవు

పంజాబ్‌ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఆగస్టు 30న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రకటించారు.పంజాబ్‌లోని పఠాన్‌కోట్, అమృత్‌సర్, హోషియార్‌పూర్, లూథియానా, పాటియాలా వంటి నగరాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా సెలవు ప్రకటించాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

జమ్మూ కాశ్మీర్‌లో..

ఇక ఆగస్టు 30న ఈ ప్రాంతం అంతటా వర్షాకాలం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో 9 నుండి 12 తరగతులకు ఆన్‌లైన్ తరగతులకు మారాలని ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు, వరదల వంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది, బోధన, బోధనేతర సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి ఈ ప్రాంతమంతటా పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష తేదీలను సవరించి తరువాత అధికారులు నిర్ణయిస్తారు.

ఇది కూడా చదవండి: TVS EV: టీవీఎస్‌ నుంచి మరో సూపర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 158 కి.మీ.. తక్కువ ధరల్లోనే..

తెలంగాణలో రేపు పాఠశాలలకు సెలవు:

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్ట్ 30న పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కళాశాలలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని జిల్లా విద్యా అధికారిని ఆదేశించారు కలెక్టర్లు. ముఖ్యంగా తెలంగాణలోని కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌తో పాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో సెలవులు ప్రకటించాలని కలెక్టర్లు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కేరళలో పాఠశాలలకు సెలవులు:

కేరళ గతంలో ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 7, 2025 వరకు 10 రోజుల పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకునే ఓనం పండుగ కారణంగా సెలవులు ప్రకటించారు. ఓనం కేరళలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వేడుక. ఇది విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి విశ్రాంతి తీసుకోవడానికి, పండగను ఘనంగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ సెలవులు ప్రకటించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో..

భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Viral Video: సంస్కారవంతమైన పామును మీరెప్పుడైనా చూశారా? మొబైల్‌లో రొమాంటిక్‌ పాటను చూసి ఏం చేసిందంటే..

ఇది కూడా చదవండి: Jio Plan: అంబానీయా మజాకా.. రూ.100తో డేటా ప్లాన్‌.. 90 రోజుల వ్యాలిడిటీ!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి