AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sadhguru: 67 ఏళ్ల వయస్సులో మెదడుకు శస్త్రచికిత్సలు.. అయినా బైక్‌పై సద్గురు 17 రోజుల కైలాస యాత్ర

Sadhguru Jaggi Vasudev: సద్గురు ప్రయాణం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా మానసిక బలానికి, ఆత్మవిశ్వాసానికి కూడా ఒక ఉదాహరణగా మారింది. "వైద్యులు అసాధ్యం అనుకున్నది నేను సాధించాను. యోగా సాధన శక్తి ఇది.. ఇది ఒక వ్యక్తిని లోపలి నుండి బలంగా చేస్తుంది..

Sadhguru: 67 ఏళ్ల వయస్సులో మెదడుకు శస్త్రచికిత్సలు.. అయినా బైక్‌పై సద్గురు 17 రోజుల కైలాస యాత్ర
Subhash Goud
|

Updated on: Aug 31, 2025 | 12:16 PM

Share

ఈషా యోగా సెంటర్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మోటార్‌సైకిల్‌పై కైలాస యాత్రను చేపట్టారు. ఇది ఆగష్టు 9, 2025న గోరఖ్‌పూర్‌ నుండి ప్రారంభమైంది. ఈ ప్రయాణం సవాలుతో కూడుకున్న పర్వత రహదారులపై కొనసాగింది. ప్రజలు ఈ యాత్రలో వర్చువల్‌గా పాల్గొనడానికి సద్గురు యాప్ అందుబాటులో ఉంది. ఈ యాత్రలో భాగంగా సద్గురు కైలాష్ పర్వతం, మోటార్‌సైకిళ్లు, ఆధ్యాత్మికత గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సద్గురు మరోసారి తన అద్భుతమైన మానసిక, శారీరక సామర్థ్యాలను ప్రదర్శించారు. రెండు ప్రధాన మెదడు శస్త్రచికిత్సల తర్వాత వైద్యుల కఠినమైన సూచనలు ఉన్నప్పటికీ సద్గురు 17 రోజుల పాటు మోటార్ సైకిల్ ద్వారా కైలాస పర్వతానికి కష్టతరమైన ప్రయాణాన్ని పూర్తి చేశారు.

Sadhguru1

శనివారం కోయంబత్తూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. సద్గురు విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ “వైద్యులు నన్ను బైక్ నడపవద్దని సలహా ఇచ్చారు. కానీ నేను సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఉన్న కైలాసానికి మోటార్ సైకిల్ మీద వెళ్ళాను. ఇదంతా యోగా శక్తికి నిదర్శనం” అని అన్నారు.

సద్గురు ప్రయాణం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా మానసిక బలానికి, ఆత్మవిశ్వాసానికి కూడా ఒక ఉదాహరణగా మారింది. “వైద్యులు అసాధ్యం అనుకున్నది నేను సాధించాను. యోగా సాధన శక్తి ఇది.. ఇది ఒక వ్యక్తిని లోపలి నుండి బలంగా చేస్తుంది” అని ఆయన అన్నారు.

Sadhguru2

సద్గురు సాహస యాత్ర చాలా మందికి ముఖ్యంగా తీవ్రమైన శారీరక సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి ప్రేరణగా మారుతోంది. ఈ ప్రయాణం తన కోసమే కాదని, యోగా నిజమైన శక్తిని ప్రపంచానికి చూపించే ప్రయత్నమని ఆయన అన్నారు. ఆయన అమెరికా విధించిన సుంకాలను కూడా ప్రస్తావించారు. “అమెరికా పన్ను వ్యవస్థ ప్రభావం చూపుతుంది. కానీ దేశ అభివృద్ధికి అవసరమైనది చేయాలి. మనం శక్తివంతమైన దేశమని నిరూపించుకోవాలి” అని అన్నారు. ఇదిలా ఉండగా, మార్చి 2022 లో సద్గురు ‘సేవ్ సాయిల్ క్యాంపెయిన్’ ను ప్రారంభించారు. ఈ ప్రచారం కేవలం 100 రోజుల్లోనే 3.91 బిలియన్లకు పైగా ప్రజలను చేరుకుంది.

View this post on Instagram

A post shared by Sadhguru (@sadhguru)