AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుండిలోని రెండస్థుల భవనంపై పిడుగు పాటు.. శిధిలాల కింద పెళ్ళికి వచ్చిన అతిధులు సమాధి.. ముగ్గురు మృతి

ఈ విషాద ఘటన బుండి జిల్లాలోని డబ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధభైస్‌కు చెందిన నయాగావ్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకలో గోర్స్య ఖేడా నివాసి కర్మా దేవి, మూడేళ్ల కుమార్తె దివ్య, బుండి గొత్డా నివాసి బాబులాల్ గుర్జార్ సహా ఇతర వ్యక్తులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు కొద్ది దూరంలోనే రెండంతస్తుల భవనంలో అతిధులకు వసతి కల్పించారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో చాలా మంది అతిథులు రెండంతస్తుల భవనం లోపల నిద్రిస్తున్నారు. ఇంతలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

బుండిలోని రెండస్థుల భవనంపై పిడుగు పాటు.. శిధిలాల కింద పెళ్ళికి వచ్చిన అతిధులు సమాధి.. ముగ్గురు మృతి
Lightning In Marriage Function
Surya Kala
|

Updated on: May 11, 2024 | 11:08 AM

Share

పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో వెలుగు చూసింది. మృతుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. పెళ్లి వేడుకకు కూతవేటు దూరంలో నిర్మించిన ఇంట్లో అందరూ నిద్రించారు. అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో ఇంట్లో ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

సమాచారం ప్రకారం ఈ విషాద ఘటన బుండి జిల్లాలోని డబ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధభైస్‌కు చెందిన నయాగావ్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకలో గోర్స్య ఖేడా నివాసి కర్మా దేవి, మూడేళ్ల కుమార్తె దివ్య, బుండి గొత్డా నివాసి బాబులాల్ గుర్జార్ సహా ఇతర వ్యక్తులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు కొద్ది దూరంలోనే రెండంతస్తుల భవనంలో అతిధులకు వసతి కల్పించారు.

రాత్రి 2 గంటల ప్రాంతంలో చాలా మంది అతిథులు రెండంతస్తుల భవనం లోపల నిద్రిస్తున్నారు. ఇంతలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. ఇంతలో రెండంతస్తుల భవనంపై పిడుగు పడింది.. దీంతో ఇల్లు కూలిపోయిందని చెబుతున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద కూరుకుపోయిన 6 మందిని ప్రజలు బయటకు తీశారు.

ఇవి కూడా చదవండి

శిథిలాల కింద కూరుకుపోయిన ఆరుగురిలో ముగ్గురు మృతి చెందగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలు తన కోడలు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చింది. దబ్లానా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మనోజ్ సింగ్ సికార్వార్ మాట్లాడుతూ రాత్రి 2 గంటల సమయంలో ఇంటి శిథిలాల క్రింద 6 మంది వ్యక్తులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. పోలీసులు క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..