ట్రైన్‌లో బాలికను వేధించిన రైల్వే ఉద్యోగి.. కొట్టిచంపిన ప్రయాణికులు.. ఎక్కడంటే..

దీంతో కోచ్‌ వద్దకు చేరకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులకు ప్రశాంత్‌ కుమార్‌ను అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

ట్రైన్‌లో బాలికను వేధించిన రైల్వే ఉద్యోగి.. కొట్టిచంపిన ప్రయాణికులు.. ఎక్కడంటే..
Railway Employee Beaten To Death
Follow us

|

Updated on: Sep 13, 2024 | 9:54 PM

మహిళలు, ఆడపిల్లలపై వేధింపులు ఆగటం లేదు.. ! ఇళ్లు, ఆఫీసు, బస్సు, రైలు ఇలా ఎక్కడపడితే అక్కడ దుండగులు ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. తాజాగా రద్దీగా ఉండే రైలులో ప్రయాణిస్తున్న బాలిక పట్ల ఏకంగా ఓ రైల్వే ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి వేధింపులతో భయపడిపోయిన ఆ బాలిక వెంటనే కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు ఆ వ్యక్తిని అక్కడే కొట్టి చంపారు. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. బీహార్‌లోని బరౌని నుంచి ఢిల్లీకి వెళ్లే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఈ సంఘటన జరిగింది.

సమాచారం మేరకు… బీహార్‌లోని సివాన్‌కు చెందిన ఒక కుటుంబం ఈ రైలులోని థర్డ్‌ ఏసీ కోచ్‌లో బుధవారం ప్రయాణించింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా సమస్త్‌పూర్ గ్రామానికి చెందిన గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్‌ కూడా అదే కోచ్‌లో ప్రయాణించాడు. ఆ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడని తెలిసింది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని,  వాష్‌రూమ్‌ నుంచి తిరిగి వచ్చిన తల్లిని పట్టుకుని ఆ బాలిక బోరున ఏడ్చింది. తల్లిని వాష్‌రూమ్‌ వద్దకు తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది.

దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్‌ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్‌లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. దీంతో అతడ్ని ఆ కోచ్ డోర్‌ వద్దకు తీసుకెళ్లారు. కదులుతున్న రైలులో పలు గంటలపాటు కొట్టారు. మరోవైపు గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ సెంట్రల్‌ స్టేషన్‌కు ఆ రైలు చేరింది. దీంతో కోచ్‌ వద్దకు చేరకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులకు ప్రశాంత్‌ కుమార్‌ను అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని వెంటనే రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ,  అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ట్రైన్‌లో బాలికను వేధించిన రైల్వేఉద్యోగి..కొట్టిచంపిన ప్రయాణికులు
ట్రైన్‌లో బాలికను వేధించిన రైల్వేఉద్యోగి..కొట్టిచంపిన ప్రయాణికులు
ఈ నెంబర్‌ నుంచి కాల్స్‌ వస్తోందా.? యూజర్లను అలర్ట్‌ చేసిన జియో..
ఈ నెంబర్‌ నుంచి కాల్స్‌ వస్తోందా.? యూజర్లను అలర్ట్‌ చేసిన జియో..
రూ. 8 వేలకే 50 ఎంపీ కెమెరా.. సామ్‌సంగ్‌ కొత్త ఫోన్
రూ. 8 వేలకే 50 ఎంపీ కెమెరా.. సామ్‌సంగ్‌ కొత్త ఫోన్
హీరోయిన్ లాంటి అందం కోరుకునే వారు ఈ ఆకును తప్పనిసరిగా తీసుకోవాలి
హీరోయిన్ లాంటి అందం కోరుకునే వారు ఈ ఆకును తప్పనిసరిగా తీసుకోవాలి
మీ ముఖం లైట్‌లా వెలిగిపోవాలా.. రోజూ ఈ జ్యూసులు తాగండి..
మీ ముఖం లైట్‌లా వెలిగిపోవాలా.. రోజూ ఈ జ్యూసులు తాగండి..
రోజుకు ఓ లవంగం తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు..
రోజుకు ఓ లవంగం తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు..
జామ ఆకులతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..ఇలా వాడితే ..
జామ ఆకులతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..ఇలా వాడితే ..
ఆకు కాదు ఇది సంజీవని.. రోగాలను తరిమికొడుతుంది..
ఆకు కాదు ఇది సంజీవని.. రోగాలను తరిమికొడుతుంది..
నళ్ల కళ్లద్దాలతో స్టైల్‌గా బరిలోకి.. కట్‌చేస్తే.. జీరోకే ఔట్..
నళ్ల కళ్లద్దాలతో స్టైల్‌గా బరిలోకి.. కట్‌చేస్తే.. జీరోకే ఔట్..
ఏం లక్​ గురూ..!చావు నోట్లోతలపెట్టి తప్పించుకున్నాడు..వీడియోచూస్తే
ఏం లక్​ గురూ..!చావు నోట్లోతలపెట్టి తప్పించుకున్నాడు..వీడియోచూస్తే
మోకాళ్ళపై నిల్చొని వారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే మద్దిపాటి
మోకాళ్ళపై నిల్చొని వారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే మద్దిపాటి
గణపతి మెడలో ఆరు తులాల బంగారుచైన్.. మర్చిపోయి నిమజ్జనం! | యూత్ అంట
గణపతి మెడలో ఆరు తులాల బంగారుచైన్.. మర్చిపోయి నిమజ్జనం! | యూత్ అంట
ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.!
ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.!
అమెరికాలో నీట మునిగి ఇద్దరు తెలుగు చిన్నారుల మృత్యువాత‌.!
అమెరికాలో నీట మునిగి ఇద్దరు తెలుగు చిన్నారుల మృత్యువాత‌.!
‘ఆపరేషన్‌ భేడియా’ సక్సెస్‌.. ఐదో తోడేలు దొరికేసింది.!
‘ఆపరేషన్‌ భేడియా’ సక్సెస్‌.. ఐదో తోడేలు దొరికేసింది.!
నర్మదా నది లోయలో అద్భుత దృశ్యం.! అబ్బురపరిచే వీడియో.
నర్మదా నది లోయలో అద్భుత దృశ్యం.! అబ్బురపరిచే వీడియో.
ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. భయబ్రాంతులకు లోనైన జనం
ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. భయబ్రాంతులకు లోనైన జనం
జాక్‌పాట్‌లో రూ. 3 లక్షలు గెలిస్తే.. రూ.1000 చేతిలో పెట్టారు.!
జాక్‌పాట్‌లో రూ. 3 లక్షలు గెలిస్తే.. రూ.1000 చేతిలో పెట్టారు.!
మొక్కజొన్న పొలంలో తప్పిపోయిన చిన్నారి కోసం వినూత్న నిర్ణయం.!
మొక్కజొన్న పొలంలో తప్పిపోయిన చిన్నారి కోసం వినూత్న నిర్ణయం.!
నదిలో మునిగిన కారు.. కారు టాప్‌ పైన జంట.! వీడియో వైరల్..
నదిలో మునిగిన కారు.. కారు టాప్‌ పైన జంట.! వీడియో వైరల్..