AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళా టీచర్‌పై దాడి .. ! విద్యార్థులా వీధి రౌడీలా..?

విద్యాబుద్దులు నేర్పించే గురువుతోనే విద్యార్థులు విధి రౌడీల్లా రెచ్చిపోయి ప్రవర్తించారు. మహిళా టీచర్‌ను చుట్టుముట్టిన  స్టూడెంట్స్ ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలిలో చోటుచేసుకుంది. రాయ్‌ బరేలీలోని గాంధీ సేవా నికేతన్‌లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై ఈ నెల 11న (నవంబర్‌) దాడి జరిగింది. విద్యార్థులంతా కూడబల్లుకుని గుంపులుగా చేరి ఆమెపై దాడి చేశారు.  రిగిన ఘటనపై బాధితురాలు టీచర్‌ మమతా దూబే మర్నాడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు […]

మహిళా టీచర్‌పై దాడి .. ! విద్యార్థులా  వీధి రౌడీలా..?
Pardhasaradhi Peri
|

Updated on: Nov 13, 2019 | 6:42 PM

Share

విద్యాబుద్దులు నేర్పించే గురువుతోనే విద్యార్థులు విధి రౌడీల్లా రెచ్చిపోయి ప్రవర్తించారు. మహిళా టీచర్‌ను చుట్టుముట్టిన  స్టూడెంట్స్ ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలిలో చోటుచేసుకుంది. రాయ్‌ బరేలీలోని గాంధీ సేవా నికేతన్‌లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై ఈ నెల 11న (నవంబర్‌) దాడి జరిగింది. విద్యార్థులంతా కూడబల్లుకుని గుంపులుగా చేరి ఆమెపై దాడి చేశారు.  రిగిన ఘటనపై బాధితురాలు టీచర్‌ మమతా దూబే మర్నాడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేసింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటుండగా తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా ..వారంతా  కలిసి తనపై దాడి చేశారని మమతా పోలీసులకు తెలిపారు. విద్యార్థులు టీచర్‌పై దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చుట్టూ చేరిన విద్యార్థులు..ఆమెను రెచ్చగొట్టేలా మాట్లాడారు.  ఆమె హ్యాండ్‌ బ్యాగును విసిరేశారు. ఆమె వెళ్లి ఆ బ్యాగును తెచ్చుకుంది. మళ్లీ అదే విద్యార్థి ఓ ప్లాస్టిక్‌ కుర్చీతో ఆమెను కొట్టాడు. ఇది జరుగుతున్నంత సేపు మిగితా విద్యార్థులు పట్టించుకోలేదని… ఈ విషయాన్ని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మమతా దూబే ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో నెటిజన్లు విస్తుపోతున్నారు. విద్యార్థుల ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు.