AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: రెండేళ్లు దూరంగా ఉన్నా.. క్షమించండి.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్..

సుదీర్ఘ విరామం అనంతరం లెనిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అఖిల్ అక్కినేని, ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. గత రెండున్నర సంవత్సరాలుగా తాను ప్రేక్షకులతో కమ్యూనికేట్ చేయలేకపోయానని, మొహం చూపించలేకపోయానని అన్నారు. లెనిన్ చిత్రం తనను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుందని, తనను "ఇంట్లో వాడిని" చేసుకునేలా చేయాలని కోరారు.

Akhil Akkineni: రెండేళ్లు దూరంగా ఉన్నా.. క్షమించండి.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్..
Akhil Akkineni
Rajitha Chanti
|

Updated on: Jul 05, 2026 | 10:22 PM

Share

లెనిన్ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లో యువ నటుడు అఖిల్ అక్కినేని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత అడియన్స్ ముందుకు వస్తున్న ఆయన.. తన మాటలతో ఆకట్టుకున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా తాను ప్రేక్షకులకు దూరంగా ఉన్నానని, వారిని కమ్యూనికేట్ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో, అలాగే ఈ ప్రి-రిలీజ్ వేడుకలో కూడా దీనికి క్షమాపణలు కోరారు. “ఇవాళ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చాను, అది లెనిన్” అని ఆయన అన్నారు. తనను ప్రేక్షకులు తమ ఇంటి బిడ్డగా భావించి, ఇంటికి తీసుకెళ్లిపోవాలని కోరారు. అప్పుడే తాను సంతోషంగా ఉంటానని, ఆ ప్రయత్నమే లెనిన్ అని స్పష్టం చేశారు. ఈ చిత్ర దర్శకుడు మురళి కిషోర్ గురించి మాట్లాడుతూ, రెండు సంవత్సరాల క్రితం ఆయనను కలిసినప్పుడు చెప్పిన అద్భుతమైన కథ తన మనసులో రన్ అవుతున్న బాధ, ప్రయాణాన్ని ప్రతిబింబించిందని అఖిల్ అన్నారు. కథ వినగానే మురళిని కౌగిలించుకుని, ఈ కథను ఇంకెవరితోనూ చేయవద్దని కోరినట్లు గుర్తు చేసుకున్నారు. మురళి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తమ కృతజ్ఞతను జూలై 10న లెనిన్ చిత్రం ద్వారా చూపుతామని హామీ ఇచ్చారు.

చిత్ర నిర్మాత వంశీతో తన అనుబంధాన్ని వివరిస్తూ, రెండు సంవత్సరాల క్రితం తాము పార్ట్‌నర్స్‌గా కలిసి ఒక గొప్ప సినిమా చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కేవలం హిట్ కొట్టడం లేదా బ్లాక్‌బస్టర్ సాధించడం మాత్రమే కాకుండా, అందరికీ ఒక మంచి సినిమాను, కొత్త అనుభూతిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎంతోమంది చేతులు కలిపారని, వారి కృషే ఈరోజు తనను ఈ వేదికపై వర్క్ సాటిస్ఫాక్షన్‌తో నిలబెట్టిందని అన్నారు. ఎడిటర్ నవీన్ నూలి, కొరియోగ్రాఫర్‌లు, ఏడీలు, డీఓపీ లియోన్ బ్రిట్టో వంటి అనేక మంది చిత్ర బృంద సభ్యుల కృషిని ప్రశంసించారు.

సంగీత దర్శకుడు తమన్ సినిమాకు ప్రాణం పోశారని, గత రెండు మూడు రోజులుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తున్నామని, ఆయన ఇరక్కొట్టేశారని అఖిల్ అన్నారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్ కొన్ని చోట్ల పూనకాలు తెప్పించిందని, అది తమకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నటి భాగ్యశ్రీ బోర్సే గురించి మాట్లాడుతూ, ఆమె తన పాత్ర కోసం చాలా కష్టపడిందని, షాట్‌కి వెళ్లేటప్పుడు ఆమె నటన తమకు కూడా ఒక ఎనర్జీని ఇచ్చిందని ప్రశంసించారు. బ్రహ్మాజీ, శివాజీ, సునీల్ వంటి ఇతర నటీనటులు కూడా చాలా కష్టపడ్డారని, ఈ చిత్రం ఒక కుటుంబంలా కలిసి చేసిన ప్రయాణమని తెలిపారు. చివరగా, జూలై 10న సినిమానే మాట్లాడాలని అఖిల్ అన్నారు. తాను, తన బృందం రెండున్నర సంవత్సరాలుగా పడిన కష్టానికి థియేటర్‌లో మంచి ప్రతిస్పందన వచ్చినప్పుడు మాత్రమే తాను మాట్లాడుతానని తెలిపారు. “ఇవాళ మీ ఓడు, మీ ఇంటోడిలాగా వచ్చాను. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, నేను హ్యాపీగా ఉంటాను” అని మరోసారి ప్రేక్షకులను కోరారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు కోరారు.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

Follow Us