Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్​అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..

లతా దీనానాథ్​ మంగేష్కర్(Lata Mangeshkar Award) తొలి అవార్డును అందుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi). లెజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​ జ్ఞాపకార్థం మాస్టర్​ దీనానాథ్​ మంగేష్కర్​ అవార్డును ఏర్పాటు చేశారు.

Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్​అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..
Lata Mangeshkar Award
Follow us

|

Updated on: Apr 24, 2022 | 7:17 PM

లతా దీనానాథ్​ మంగేష్కర్(Lata Mangeshkar Award) తొలి అవార్డును అందుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi). లెజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​ జ్ఞాపకార్థం మాస్టర్​ దీనానాథ్​ మంగేష్కర్​ అవార్డును ఏర్పాటు చేశారు. ముంబైలోని షణ్ముకానంద హాల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు ప్రధాని మోడీ. అంతకుముందు లతా మంగేష్కర్​ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ అవార్డును దేశప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా, సంగీతం, ధ్యానం మరియు భావోద్వేగం కూడా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ వేడుకలో లతా మంగేష్కర్‌ను గుర్తు చేసుకుంటూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. తరతరాలకు ప్రేమ, భావోద్వేగాలను బహుమతిగా అందించిన లతా దీదీ నుంచి సోధరి ప్రేమను పొందానని ప్రధాని అన్నారు. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? చాలా దశాబ్దాల తర్వాత, ఈ మొదటి రాఖీ పండుగ వస్తుంది. ఇప్పుడు సోదరి లేదు. సుధీర్ ఫడ్కే నా లతా దీదీని మొదటిసారి కలిసేలా చేశారని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

లతా దీదీ సింప్లిసిటీకి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. లతా దీదీ సంగీతంలో ఆ స్థానాన్ని సాధించారు. ప్రజలు ఆమెను మా సరస్వతికి చిహ్నంగా భావిస్తారు. దాదాపు 80 ఏళ్ల పాటు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. సంగీతం మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది.

దేశానికి, ప్రజలకు, సమాజానికి మార్గనిర్దేశం చేస్తూ.. విశేష కృషి చేసే వ్యక్తికి ఈ అవార్డును ప్రతిఏటా అందజేస్తామని మాస్టర్​ దీనానాథ్​ మంగేష్కర్​ స్మృతి ప్రతిష్ఠాన్​ ఛారిటబుల్​ ట్రస్ట్ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఉషా మంగేష్కర్​, ఆశా భోస్లే, మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ సహా ప్రముఖులు హాజరయ్యారు. లెజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​ 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఈ ఏడాది ఫిబ్రవరి 6న కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి: Viral Video: వెరైటీగా ట్రై చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. వీర ప్రేమికుడికి షాక్ ఇచ్చిన పోలీసులు..

Kurnool: కర్నూలు జిల్లాలో కిలాడి దంపతులు.. చోర విద్యలో ప్రావీణ్యులు.. ఏమార్చి..

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్