PM Narendra Modi: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్.. డైమండ్‌ బోర్స్‌ను ప్రారంభించిన మోదీ..

దేశంలో డైమండ్స్‌ బిజినెస్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది సూరత్‌. ఎందుకంటే, దేశంలో వజ్రాభరణాలకు పెట్టింది పేరు సూరత్‌. డైమండ్స్‌ బిజినెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న సూరత్‌.. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెంటర్‌గా మారబోతోంది. వజ్రాభరణాల ట్రేడింగ్‌ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ కార్యాలయాన్ని నిర్మించారు ఓ వ్యాపారి. సూరత్‌లో నిర్మించిన డైమండ్‌ బోర్స్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు ప్రధాని మోదీ.

PM Narendra Modi: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్.. డైమండ్‌ బోర్స్‌ను ప్రారంభించిన మోదీ..
Pm Modi

Edited By:

Updated on: Dec 17, 2023 | 2:59 PM

దేశంలో డైమండ్స్‌ బిజినెస్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది సూరత్‌. ఎందుకంటే, దేశంలో వజ్రాభరణాలకు పెట్టింది పేరు సూరత్‌. డైమండ్స్‌ బిజినెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న సూరత్‌.. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెంటర్‌గా మారబోతోంది. వజ్రాభరణాల ట్రేడింగ్‌ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ కార్యాలయాన్ని నిర్మించారు ఓ వ్యాపారి. సూరత్‌లో నిర్మించిన డైమండ్‌ బోర్స్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు ప్రధాని మోదీ. డైమండ్‌ బోర్స్‌.. ఇదో అత్యంత ఆధునిక నిర్మాణం. 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఒకేసారి 67వేల మంది కంఫర్ట్‌బుల్‌గా కార్యకలాపాలు చేసుకునేలా ఈ భవన నిర్మాణం జరిగింది. 4500పైగా వివిధ కార్యాలయాలున్న ఈ భవనంలో 131 హైస్పీడ్‌ లిఫ్ట్‌లు ఉన్నాయ్‌. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టెడ్‌ భవనంగా రికార్డ్‌ సృష్టించింది ఈ నిర్మాణం.

అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం కాబోతోంది. ఈ భవనంలో 175 దేశాల నుంచి 4వేల మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఎగుమతులు-దిగుమతులు, కస్టమ్స్‌ క్లియరెన్స్‌, రిటైల్‌ జువెలరీ, డైమండ్ రీసెర్చ్ సెంటర్‌… ఇలా ఎన్నో విభాగాలు ఇక్కడ ఉన్నాయ్‌. ప్రత్యక్షంగా పరోక్షంగా డైమండ్‌ బోర్స్‌ ద్వారా లక్షన్నర మందికి ఉపాధి లభించబోతోంది. డైమండ్‌ బోర్స్‌ సెంటర్‌తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపు వస్తుందన్నారు ప్రధాని మోదీ. గత 80ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటగాన్‌ను.. సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ అధిగమించిందన్నారు మోదీ. ప్రస్తుతం ఏటా 2లక్షల కోట్ల రూపాయల వజ్రాల వ్యాపారం జరుగుతుండగా.. ఇప్పుడది 4లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..