AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Kashmir Tour: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్‌‌లో ప్రధాని మోదీ పర్యటన

రెండేళ్ల ఎనిమిది నెలల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడకు వెళుతుండటం ఇదే ఫస్ట్‌ టైమ్‌. ఇప్పుడు అందరి ఫోకస్‌ రేపటి మోదీ జమ్ము కశ్మీర్‌ పర్యటనపై ఉంది.

Modi Kashmir Tour: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్‌‌లో ప్రధాని మోదీ పర్యటన
Pm Modi
Balaraju Goud
|

Updated on: Apr 23, 2022 | 7:43 AM

Share

Modi Jammu Kashmir Tour: రెండేళ్ల ఎనిమిది నెలల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అక్కడకు వెళుతుండటం ఇదే ఫస్ట్‌ టైమ్‌. ఇప్పుడు అందరి ఫోకస్‌ రేపటి మోదీ జమ్ము కశ్మీర్‌(Jammu Kashmir) పర్యటనపై ఉంది. రేపు జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం. రేపే ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నారు. 2019 ఆగస్టు 5న మోదీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. దాంతో ప్రత్యేక హోదాను కోల్పోయింది జమ్ము కశ్మీర్‌. అంతేకాకుండా ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అత్యంత కీలకమైన ఈ రెండు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మోదీ జమ్ము కశ్మీర్‌కు వెళుతుండటం ఇదే మొదటిసారి.

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ వేళ సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దేశంలోని మొదటి కార్బన్‌-న్యూట్రల్‌ గ్రామంగా పల్లీ గుర్తింపు పొందింది. ఇక్కడ నుంచే 32 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. ఇది జమ్ము కశ్మీర్‌ అభివృద్ధిపరంగా ఎలా మార్పు చెందుతోందో చెప్పే ప్రయత్నమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే 2018 జూన్‌ నుంచి జమ్ము కశ్మీర్‌లో కేంద్ర పాలన కొనసాగుతోంది. అయితే తగిన సమయంలో జమ్ము కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని 2019లో ఇండిపెండెన్స్‌ డే స్పీచ్‌లో హామీ ఇచ్చారు ప్రధాని మోదీ.

గత ఏడాది జూన్‌ 24 జమ్ము కశ్మీర్‌కు చెందిన నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు మోదీ. అప్పుడు మొదలైన రాజకీయ ప్రక్రియ విషయంపై మోదీ ఏం మాట్లాడతారనే ఆసక్తి నెలకొంది. మరోవైపు జమ్ము కశ్మీర్‌ డీలిమిటేషన్‌ కమిషన్‌ తన డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఇక ఎన్నికల నగారా మోగేది ఎప్పుడో తేలాల్సి ఉంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ డిమాండ్‌పై టైమ్‌లైన్‌ సెట్‌ చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే మోదీ పర్యటనకు 48 గంటల ముందు భారీ ఉగ్ర దాడులు జరిగాయి. సీఐఎస్‌ఎఫ్‌ ఫోర్స్‌ను తరలిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు అండర్‌ బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంచర్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు సిబ్బంది గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబా కమాండర్‌ యూసఫ్‌ కంత్రూ కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో జమ్ము కశ్మీర్‌లో భద్రతను పెంచారు.

Read  Also… Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోనూ బుల్‌డోజర్ కలకలం.. ఏకంగా అధికారిపైనే..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా