
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. గురునానక్ దేవ్ జీ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో శ్రీ గురునానక్ దేవ్ జీ 553వ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా నివాసంలో ఈ వేడుక జరుగనుంది. ఈరోజు సాయంత్రం 8 గంటలకు ఢిల్లీలోని లోధీ ఎస్టేట్లోని 95లో శ్రీ గురునానక్ దేవ్ జీ 553వ జయంతి వేడుకలు జరుగుతాయని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
జాతీయ మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా నివాసంలో జరిగే ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని.. శ్రీ గురునానక్ దేవ్ జీకి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని పీఎంఓ తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తారని వెల్లడించింది.
On the eve of #GuruNanakJayanti, PM @narendramodi will participate in the 553rd Birth Anniversary celebration of Sri Guru Nanak Dev ji at 95, Lodhi Estate in Delhi today evening at around 8 PM. @PMOIndia pic.twitter.com/cWExGdWzQa
— DD News (@DDNewslive) November 7, 2022
ఇదిలావుండగా గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ మానవజాతికి ప్రబోధించిన మార్గదర్శకాలు.. విలువలు ఆచరణనీయమని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..