AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CycloneYaas : యాస్ తుఫానుపై ప్రధాని రివ్యూ .. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఆయా మంత్రిత్వశాఖలకు దిశానిర్దేశం

PM Narendra Modi review : యాస్ తుఫాను సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ..

CycloneYaas : యాస్ తుఫానుపై ప్రధాని రివ్యూ .. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఆయా మంత్రిత్వశాఖలకు దిశానిర్దేశం
Pm Narendra Modi Review
Venkata Narayana
|

Updated on: May 23, 2021 | 12:27 PM

Share

PM Narendra Modi review : యాస్ తుఫాను సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కొంచెంసేపటి క్రితం వివిధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నుండి సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు, టెలికాం కార్యదర్శులు, విద్యుత్, పౌర విమానయానం, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలతో పిఎం నరేంద్ర మోడీ సైక్లోన్ యాస్ తీవ్రతను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న సన్నాహాలను సమీక్షించారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాస్ తుఫానును ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలంటూ మోదీ ఆయా మంత్రిత్వశాఖ అధికారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ మోదీ దిశానిర్ధేశం చేశారు.

కాగా, యాస్ తుఫానుపై క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ(ఎన్‌సీఎంసీ) స‌మావేశం నిన్న జ‌రిగిన సంగతి తెలిసిందే. తూర్పున బంగాళాఖాతంలో కేంద్రీకృత‌మై ఉన్న ‘యాస్’ తుఫాను ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, ఏజెన్సీల సంసిద్ధతను ఎన్‌సీఎంసీ స‌మావేశంలో సమీక్షించింది. మే 26 సాయంత్రానికి యాస్ తుపాను పశ్చిమ బెంగాల్, ప్రక్కనే ఉన్న ఉత్తర ఒడిశా రాష్ట్ర తీరాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. తుపాను యొక్క తాజా స్థితి గురించి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) ఈ కమిటీకి వివరించారు. యాస్ తుపాను గాలి వేగం 155 నుండి 165 కిలోమీటర్ల మేర ఉండ‌వ‌చ్చ‌ని.. దీంతో ఈ రాష్ట్రాల తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతంతో కూడిన‌ తుఫాను వ‌ర్షాలు సంభవించే అవ‌కాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ వెల్లడించారు. తుఫాను ఎదుర్కోవటానికి సన్నాహక చర్యల గురించి సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కమిటీకి వివరించారు.

ఇలాఉండగా, యాస్ ముప్పు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను తరలిస్తున్నారు. ఆహార ధాన్యాలు, తాగు నీరు, ఇతర నిత్యావసర సామాగ్రి సంబంధించి త‌గు నిల్వలు ఏర్పాటు చేశారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా, టెలికమ్యూనికేషన్స్ వంటి అవసరమైన సేవలకు అవరోధం కలుగకుండా సన్నాహాలు చేసుకున్నారు. 65 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల‌ను మోహరించడంతోపాటు, ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్‌ల‌కు చెందిన‌ రెస్క్యూ ఇంకా, రిలీఫ్ టీంలతో పాటుగా ఓడలు మసాయ‌రియు విమానాలను కూడా సిద్ధంగా ఉంచారు.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా