Modi New Cabinet: స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ సహా మోదీ 3.0లో చోటు దక్కని 20 మంది మంత్రులు

|

Jun 09, 2024 | 4:45 PM

నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈసారి మోదీ 3.0 ప్రభుత్వంలో ఏయే ముఖాలు చేరుతాయోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం మోదీతో పాటు 65 మంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

Modi New Cabinet: స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ సహా మోదీ 3.0లో చోటు దక్కని 20 మంది మంత్రులు
Modi Cabinet
Follow us on

నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ఆదివారం (జూన్ 9) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈసారి మోదీ 3.0 ప్రభుత్వంలో ఏయే ముఖాలు చేరుతాయోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం మోదీతో పాటు 65 మంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈసారి బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీయే మిత్రపక్షాల బలంతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయే మిత్రపక్షాలకు కూడా కేబినెట్‌లో స్థానం కల్పిస్తున్నారు. స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, రాజీవ్‌ చంద్రశేఖర్‌ వంటి నేతల పేర్లు ఈసారి కేబినెట్‌ కల్పిండానికి కారణం ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ కేబినెట్‌లో చోటు దక్కని నేతల గురించి తెలుసుకుందాం.

మంత్రివర్గంలో ఏ నేతలకు చోటు దక్కదు..?

మోదీ ప్రభుత్వం రెండో పర్యాయం హయాంలో స్మృతి ఇరానీ నుంచి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వంటి నేతలకు ముఖ్యమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించారు. అలాగే అనురాగ్ ఠాకూర్ క్రీడా మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పుడు మొత్తం 20 మంది నాయకులు మోదీ 3.0లోకి ప్రవేశించడం లేదు. ఎందుకంటే ప్రధాని నివాసంలో కాబోయే మంత్రుల సమావేశం జరిగింది. అందులో ఈ నాయకులు కనిపించకపోవడం విశేషం. దీన్ని బట్టి వారు ఈసారి మోదీ కేబినెట్‌లోకి వెళ్లరని తేలిపోయింది.

మంత్రివర్గంలోకి రాని నేతలు. ఇందులో స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, రాజీవ్ చంద్రశేఖర్, అజయ్ మిశ్రా టెనీ, జనరల్ వీకే సింగ్, అశ్విని చౌబే, నారాయణ్ రాణే పేర్లు ఉన్నాయి. అదే విధంగా, అజయ్ భట్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మీనాక్షి లేఖి, రాజ్‌కుమార్ రంజన్ సింగ్, ఆర్‌కె సింగ్, అర్జున్ ముండా, నిషిత్ ప్రమాణిక్, సుభాష్ సర్కార్, జాన్ బార్లా, భారతీ పన్వార్, రావుసాహెబ్ దాన్వే, కపిల్ పాటిల్, నారాయణ్ రాణే, భగవత్ కరద్ కూడా ఉన్నారు. వీరందరికి కొత్త మంత్రివర్గంలో చోటు దొరకలేదని తెలుస్తోంది.

కేబినెట్‌లో చేరని కొందరు నేతలకు టిక్కెట్లు కట్‌ కాగా, మరికొందరు ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే, ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వారిలో కొందరు నాయకులు ఉండగా, మరి కొందరికి బీజేపీ ఈసారి లోక్‌సభ టిక్కెట్‌ కూడా ఇవ్వలేదు. దీంతో పాటు టిక్కెట్లు పొంది ఎన్నికల్లో గెలిచిన కొందరు నేతలు కూడా మంత్రివర్గానికి దూరంగా ఉన్నారు.

గెలిచిన నేతలు:

అజయ్ భట్, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణే తమ తమ స్థానాల్లో భారీ ఓట్లతో గెలిచారు. అయినప్పటికీ కూడా వారికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు.

ఓడిపోయిన నేతలు:

సాధ్వి నిరంజన్, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, నిషిత్ ప్రమాణిక్, అజయ్ మిశ్రా తేని, సుభాష్ సర్కార్, భారతీ పన్వార్, రావ్ సాహెబ్ దాన్వే, కపిల్ పాటిల్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు.

టిక్కెట్లు రద్దు:

మీనాక్షి లేఖి, రాజ్‌కుమార్ రంజన్ సింగ్, జనరల్ వీకే సింగ్, జాన్ బార్లా, అశ్విని చౌబేలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..