AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కలకత్తా హైకోర్టు తీర్పుపై స్పందించిన ప్రధాని మోదీ.. ఓటు బ్యాంకు రాజకీయాలు చెల్లవంటూ..

ఈ రోజు కోల్‌కతా హైకోర్టు 2010 తర్వాత జారీ చేసిన అన్ని OBC సర్టిఫికేట్‌లను రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు అన్ని హద్దులు దాటిపోతున్నాయని మోదీ విమర్శించారు.

PM Modi: కలకత్తా హైకోర్టు తీర్పుపై స్పందించిన ప్రధాని మోదీ.. ఓటు బ్యాంకు రాజకీయాలు చెల్లవంటూ..
Pm Modi
Jyothi Gadda
|

Updated on: May 22, 2024 | 10:07 PM

Share

పశ్చిమ బెంగాల్‌లో 2010 తర్వాత జారీ చేసిన అన్ని OBC సర్టిఫికెట్‌లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. ఢిల్లీలోని ద్వారకాలో ఎన్నికల ర్యాలీలో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2011 నుండి అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ముస్లింలకు ఓబిసి సర్టిఫికేట్ ఇచ్చిందని అన్నారు. ఓటు బ్యాంకు. యూనియన్ ఆఫ్ ఇండియా చేస్తున్న ఈ నీచ రాజకీయాలకు నేడు హైకోర్టు పెద్ద ఊరటనిచ్చిందన్నారు.

ఈ రోజు కోల్‌కతా హైకోర్టు 2010 తర్వాత జారీ చేసిన అన్ని OBC సర్టిఫికేట్‌లను రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు అన్ని హద్దులు దాటిపోతున్నాయని మోదీ విమర్శించారు.

ఈరోజు కోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంపదెబ్బలాంటి తీర్పు నిచ్చింది కోర్టు.  దేశంలోని వనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉందని అంటున్నారు. ప్రతిపక్షాలు ఓట్ల కోసం ప్రభుత్వ భూమిని వక్ఫ్ బోర్డుకు ధారాదత్తం చేస్తున్నాయి. ప్రతిఫలంగా ఓట్లు అడుగుతున్నారని మోదీ ఆరోపించారు.