‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్’ అభియాన్కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 'నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్' అభియాన్కు శ్రీకారం చుట్టారు. 100 వారాల పాటు కొనసాగే ఈ దేశవ్యాప్త ప్రచారంలో యువత, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.

దేశాన్ని మాదకద్రవ్యాల రహిత భారతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్’అభియాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా 100 వారాల పాటు కొనసాగే ‘జన్ భాగిదారి’ ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. దేశంలోని 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్చువల్గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్లు, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యువ విభాగాలు, 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వాములయ్యాయి.
ఈ అభియాన్లో భాగంగా వచ్చే 100 వారాల పాటు ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. క్రీడా పోటీలు, వాక్థాన్లు, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, నుక్కడ్ నాటకాలు, చర్చా వేదికలు, చిత్రలేఖన పోటీలు, కమ్యూనిటీ అవుట్రీచ్ కార్యక్రమాలు నిర్వహించి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.
ఈ ప్రచారం ద్వారా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడమే కాకుండా, తమ సమాజంలో సానుకూల మార్పుకు రాయబారులుగా మారేలా ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, ‘విక్సిత్ భారత్’ సాధనలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
