బాణసంచా గోడౌన్లో పేలుడు.. 21కి చేరిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్భ్రాంతి
పేలుడు ధాటికి గోడౌన్ స్లాబ్ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగినట్టుగా చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీసేందుకు ఫోరెన్సిక్ బృందాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గోదాంలో అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్టుగా వివరించారు.

గుజరాత్ లోని దీసా పట్టణంలో మంగళవారం బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు సంబంవించింది.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 21 చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఐదుగురు పిల్లలు, ఐదుగురు మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు. వీరంతా మధ్యప్రదేశ్లోని హర్దా, దేవాస్ జిల్లాల నుండి వచ్చిన కార్మికులుగా అధికారులు నిర్దారించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గోడౌన్లోని బాయిలర్ పేలడంతో పైకప్పు, కొన్ని గోడలు కూలిపోయాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. పేలుడు ధాటికి గోడౌన్ స్లాబ్ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగినట్టుగా చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీసేందుకు ఫోరెన్సిక్ బృందాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గోదాంలో అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.
Deeply saddened by the loss of lives in the explosion at a firecracker factory in Banaskantha, Gujarat. Condolences to those who lost their loved ones. May the injured recover soon. The local administration is assisting those affected.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would…
— PMO India (@PMOIndia) April 1, 2025
ఇదిలా ఉంటే, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..