PM Modi: భారత ప్రధాని మోదీతో డెన్మార్క్ ప్రధాని ఫోన్ చర్చ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని మేటే ఫ్రెడరిక్సన్ శనివారం ఫోన్లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను బలపరచాలని, వాణిజ్యం, పెట్టుబడులు, ఇన్నోవేషన్, విద్యుత్, నీటి నిర్వహణ, ఆహార ప్రాసెసింగ్, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీకి డెన్మార్క్ ప్రధాని మేటే ఫ్రెడరిక్సన్ శనివారం ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలపరచాలని ఇద్దరూ నిర్ణయించారు. వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త ఆవిష్కరణలు, విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణ, ఆహార ప్రాసెసింగ్, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. డెన్మార్క్ ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష దేశంగా, అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యదేశంగా ఉన్నందుకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కూడా ఇరువురి చర్చ జరిగింది. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం రావాలని, ప్రాంతంలో మళ్లీ శాంతి, స్థిరత్వం నెలకొనాలని భారతదేశం కోరుకుంటుందని మోదీ చెప్పారు. ఇండియా-యూరోపియన్ యూనియన్ ఉచిత వాణిజ్య ఒప్పందం (India-EU FTA) త్వరగా పూర్తవ్వాలని డెన్మార్క్ ప్రధాని బలమైన మద్దతు తెలిపారు. అలాగే 2026లో భారతదేశం నిర్వహించనున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సంభాషణతో రెండు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
