AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమ వీసాలపై హామీ ఇవ్వాలంటూ ఐసీసీని వేడుకున్న పాక్‌

వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఆడుతుందా లేదా? భారత్‌లో ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది పాకిస్తాన్‌... భారత్‌ మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది..

తమ వీసాలపై హామీ ఇవ్వాలంటూ ఐసీసీని వేడుకున్న పాక్‌
Balu
|

Updated on: Oct 21, 2020 | 10:39 AM

Share

వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఆడుతుందా లేదా? భారత్‌లో ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది పాకిస్తాన్‌… భారత్‌ మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది.. రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లన్నీ రద్దు అయ్యాయి.. ఐసీసీ టోర్నమెంట్లలోనే రెండు దేశాలు తలపడుతున్నాయి.. అయితే వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఇండియాలో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు తమకు వీసాలు మంజూరుపై హామీ ఇవ్వాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వసీం ఖాన్‌ ఐసీసీకి విన్నవించుకున్నాడు.. ఇప్పుడున్న పరిస్థితులలో తామేమీ ద్వైపాక్షిక సిరీస్‌ను ఆశించడం లేదని, ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నమెంట్‌లో ఆడే అవకాశం ఇవ్వాలని అన్నారు.. వరల్డ్‌కప్‌ అన్నది ఐసీసీకి సంబంధించిన విషయం కాబట్టి తమకు భారత్‌లో ఆడేందుకు వీసాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్‌లో పాల్గొనే అన్ని జట్లకు టోర్నమెంట్‌ను నిర్వహించే దేశమే వసతులు కల్పించాల్సి ఉంటుందని, పాకిస్తాన్‌ కూడా అందులో భాగమేనని వసీం ఖాన్‌ తెలిపారు. తమ ఆటగాళ్లకు వీసాలు వచ్చేలా ఐసీసీ హామీ ఇస్తుందని అనుకుంటున్నామన్నారు. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో ఐసీసీ మాట్లాడలని ఆయన కోరారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ముంబాయిపై ఉగ్రవాదుల దాడి తర్వాత అంటే 2008 తర్వాత భారత క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌లో అడుగు పెట్టలేదు. పాకిస్తాన్‌ మాత్రం మన దేశంలో జరిగిన టీ-20 సిరీస్‌లో పాల్గొన్నది..