Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అదే.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థుల బలవన్మరణాలకు ప్రధాన కారణమి అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగానే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది...

Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అదే.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.
Supreme Court
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 21, 2023 | 8:03 AM

విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతూనే ఉన్నాయి. జతీయ నేర నమోదుల విభాగం – 2020 నివేదిక ప్రకారం దేశంలో సుమారు 8.2 శాతం మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు విద్యార్థుల ఆత్మహత్యలు ఎంతటి సీరియస్‌ అంశమో. ఇదిలా ఉంటే తాజాగా సుప్రీం కోర్ట్‌ విద్యార్థుల బలవన్మరణంపై సంచనల వ్యాఖ్యలు చేసింది.

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థుల బలవన్మరణాలకు ప్రధాన కారణమి అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగానే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కోచింగ్‌ సెంటర్లను నియంత్రించడం విషయంలో.. సంజీవ్ ఖన్నా, ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా న్యాయవ్యవస్థ ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది.

కోచింగ్ సెంటర్లను నియంత్రించడం తేలికైన విషయం కాదన్న సుప్రీం కోర్ట్‌.. ఇటువంటి సంఘటనలన్నింటి వెనక తల్లిదండ్రుల ఒత్తిడే అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది. కోచింగ్‌ సెంటర్లు ఉండకూడదని చాలామంది కోరుకుంటారు. కానీ, పాఠశాలల్లో పరిస్థితులు, అక్కడ తీవ్రమైన పోటీ.. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఈ కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తెలిపారు. దేశంలో దాదాపు 8.2శాతం మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఊటంకించారు. పిటిషనర్‌ ధర్మాసం ఈ పరిస్థితిపై తమకూ అవగాహన ఉందని, అయినప్పటికీ ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.

ఇక పిటిషన్‌లో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రస్తావించారు. కోచింగ్ సెంటర్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది వారిని అసాధారణ పరిస్థితుల్లో జీవించేలా, చదువుకునేలా చేస్తుందని తెలిపారు. మానసిక ఆరోగ్యం చాలా ప్రమాదకరైందని, శరీరంలోని ఇతర వ్యాధుల్లా మానసకి అనారోగ్యం కనిపించదని తెలిపారు. అయితే ఇతర శారీరక రుగ్మతల మాదిరిగానే మానసిక ఆరోగ్యం కూడా చుట్టుపక్కల వాతావరణం, ఒత్తిళ్ల ద్వారా ప్రేరేపితమవుతాయని, విద్యార్థుల ఆత్మహత్యలు మానవ హక్కులకు సంబంధించిన తీవ్ర ఆందోళన అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యకరమైనవే.. వేసవిలో ఏది బెస్ట్ అంటే..
పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యకరమైనవే.. వేసవిలో ఏది బెస్ట్ అంటే..
జాబ్ మార్కెట్‌ నయా ట్రెండ్.. స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ అవసరం గురూ!
జాబ్ మార్కెట్‌ నయా ట్రెండ్.. స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ అవసరం గురూ!
ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా..! భర్తలతో కలిసి కన్నతండ్రిని..
ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా..! భర్తలతో కలిసి కన్నతండ్రిని..
శనీశ్వర ఆలయం సంచలన ప్రకటన.. మార్చి 29న శనీశ్వర సంచారంపై గందరగోళం
శనీశ్వర ఆలయం సంచలన ప్రకటన.. మార్చి 29న శనీశ్వర సంచారంపై గందరగోళం
ఓటీటీలోకి వచ్చేస్తున్న మజాకా.. ఎప్పుడంటే
ఓటీటీలోకి వచ్చేస్తున్న మజాకా.. ఎప్పుడంటే
పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే తగిలింది..
పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే తగిలింది..
ఈ 10 సాఫ్ట్ స్కిల్స్ మీలో లేకుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు..
ఈ 10 సాఫ్ట్ స్కిల్స్ మీలో లేకుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు..
మరో 10 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. సీఎం ప్రకటన
మరో 10 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. సీఎం ప్రకటన
మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట
మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట
రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!