Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అదే.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థుల బలవన్మరణాలకు ప్రధాన కారణమి అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగానే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది...

Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అదే.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.
Supreme Court
Follow us

|

Updated on: Nov 21, 2023 | 8:03 AM

విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతూనే ఉన్నాయి. జతీయ నేర నమోదుల విభాగం – 2020 నివేదిక ప్రకారం దేశంలో సుమారు 8.2 శాతం మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు విద్యార్థుల ఆత్మహత్యలు ఎంతటి సీరియస్‌ అంశమో. ఇదిలా ఉంటే తాజాగా సుప్రీం కోర్ట్‌ విద్యార్థుల బలవన్మరణంపై సంచనల వ్యాఖ్యలు చేసింది.

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థుల బలవన్మరణాలకు ప్రధాన కారణమి అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగానే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కోచింగ్‌ సెంటర్లను నియంత్రించడం విషయంలో.. సంజీవ్ ఖన్నా, ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా న్యాయవ్యవస్థ ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది.

కోచింగ్ సెంటర్లను నియంత్రించడం తేలికైన విషయం కాదన్న సుప్రీం కోర్ట్‌.. ఇటువంటి సంఘటనలన్నింటి వెనక తల్లిదండ్రుల ఒత్తిడే అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది. కోచింగ్‌ సెంటర్లు ఉండకూడదని చాలామంది కోరుకుంటారు. కానీ, పాఠశాలల్లో పరిస్థితులు, అక్కడ తీవ్రమైన పోటీ.. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఈ కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తెలిపారు. దేశంలో దాదాపు 8.2శాతం మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఊటంకించారు. పిటిషనర్‌ ధర్మాసం ఈ పరిస్థితిపై తమకూ అవగాహన ఉందని, అయినప్పటికీ ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.

ఇక పిటిషన్‌లో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రస్తావించారు. కోచింగ్ సెంటర్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది వారిని అసాధారణ పరిస్థితుల్లో జీవించేలా, చదువుకునేలా చేస్తుందని తెలిపారు. మానసిక ఆరోగ్యం చాలా ప్రమాదకరైందని, శరీరంలోని ఇతర వ్యాధుల్లా మానసకి అనారోగ్యం కనిపించదని తెలిపారు. అయితే ఇతర శారీరక రుగ్మతల మాదిరిగానే మానసిక ఆరోగ్యం కూడా చుట్టుపక్కల వాతావరణం, ఒత్తిళ్ల ద్వారా ప్రేరేపితమవుతాయని, విద్యార్థుల ఆత్మహత్యలు మానవ హక్కులకు సంబంధించిన తీవ్ర ఆందోళన అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023