సైన్యం చేతికి చిక్కిన మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది
హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను మట్టుబెట్టిన మరుసటి రోజే.. సైన్యం చేతికి మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది చిక్కాడు. గత నాలుగు రోజుల క్రితం కూడా హైదర్ అనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. తాజాగా.. హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్ర సంస్థకు చెందిన రఖీబ్ ఆలమ్ అనే ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఓ పిస్టల్తో పాటు.. వైర్లెస్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. […]
హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను మట్టుబెట్టిన మరుసటి రోజే.. సైన్యం చేతికి మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది చిక్కాడు. గత నాలుగు రోజుల క్రితం కూడా హైదర్ అనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. తాజాగా.. హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్ర సంస్థకు చెందిన రఖీబ్ ఆలమ్ అనే ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఓ పిస్టల్తో పాటు.. వైర్లెస్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సదరు ఉగ్రవాది నుంచి లోయలో జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాల గురించి తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం పట్టుబడ్డ హైదర్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఇప్పటి వరకు 64 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు జమ్ముకశ్మీర్ ఐజీ వెల్లడించారు. అంతేకాదు.. మరో 25 మందిని సజీవంగా పట్టుకున్నట్లు తెలిపారు. గడిచిన నాలుగు నెలల్లో మొత్తం 27 టెర్రర్ ఆపరేషన్లు నిర్వహించినట్టు పేర్కొన్నారు.