ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్ 11 బోగీలు!
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బెంగళూరు నుండి గౌహతి వెళ్తున్న కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు 11 బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారుల నుండి అందిన సమాచారం ప్రకారం, ఈ సంఘటన ఖుర్దా డివిజన్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం గానీ గాయాలకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి గౌహతి వెళ్తున్న కామాఖ్య ఎక్స్ప్రెస్ (12251) 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన 11:54 గంటల మధ్య జరిగిందని చెబుతున్నారు. రైల్వే నుండి అందిన సమాచారం ప్రకారం, ఈ సంఘటన కటక్ సమీపంలోని నెర్గుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయం గురించి ఇంకా వార్తలు రాలేదు. ప్రస్తుతం రైల్వే సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ సంఘటనకు సంబంధించి తూర్పు కోస్ట్ రైల్వే సీపీఆర్ఓ అశోక్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, 12551 కామాఖ్య సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పినట్లు సమాచారం అందిందని అన్నారు. 11 ఏసీ కోచ్లు పట్టాలు తప్పినట్లు సమాచారం అందింది. ఎవరూ గాయపడలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందినంత వెంటనే, ప్రమాద స్థలానికి సహాయ రైలు, అత్యవసర వైద్య పరికరాలను పంపామని తెలిపారు.
డిఆర్ఎం ఖుర్దా రోడ్, జిఎం, ఇసిఓఆర్, ఇతర ఉన్నత స్థాయి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు తర్వాత మనకు కారణం తెలుస్తుందన్నారు అధికారులు. మొదటి ప్రాధాన్యత ఈ మార్గంలో వేచి ఉన్న రైళ్లను దారి మళ్లించడం, పునరుద్ధరణ పనులు ప్రారంభించామన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉందన్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
#WATCH | Cuttack, Odisha: 11 coaches of 12551 Bangalore-Kamakhya AC Superfast Express derailed near Nergundi Station in Cuttack-Nergundi Railway Section of Khurda Road Division of East Coast Railway at about 11:54 AM today. There are no injuries or casualties reported till now. pic.twitter.com/xBOMH4nRRh
— ANI (@ANI) March 30, 2025
దారి మళ్లించిన రైళ్ల వివరాలు
కామాఖ్య ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన కారణంగా, ఈ రైళ్ల మార్గాన్ని మళ్లించారు.
12822 (బ్రాగ్)
12875 (బిబిఎస్)
22606 (ఆర్టిఎన్)
హెల్ప్లైన్ నంబర్ విడుదల
రైలు బోగీలు పట్టాలు తప్పిన ప్రదేశానికి సంబంధించి టెలిఫోన్ నంబర్ – 8991124238, కటక్ హెల్ప్లైన్ నంబర్ – 8991124238 అందుబాటులోకి ఉంచుతున్నట్లు రైల్వే ఉన్నాతాధికారులు తెలిపారు.
ఒడిశాలో అప్పుడప్పుడు అనేక చిన్న, పెద్ద రైలు ప్రమాదాలు జరిగాయి. గత సంవత్సరం భువనేశ్వర్ సమీపంలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అయితే, ఇందులో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఒడిశాలో అతిపెద్ద రైలు ప్రమాదం 2023లో జరిగింది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఒక గూడ్స్ రైలు ఢీకున్నాయి. ఆ సమయంలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 296 మందికి పైగా మరణించగా, 1200 మందికి పైగా గాయపడ్డారు. ఇక 2022లో, కోరై రైల్వే స్టేషన్ సమీపంలో ఒక సరుకు రవాణా రైలు పట్టాలు తప్పి స్టేషన్ భవనంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, గూడ్స్ రైలులోని 12 బోగీలు దెబ్బతిన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
