నిర్భయ: పవన్​ క్యురేటివ్​ పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నాలుగో దోషి పవన్​ గుప్తా క్యురేటివ్​ పిటిషన్​పై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. ఇంకా దోషుల పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున మార్చి 3న ఉరి అమలుపై ...

నిర్భయ: పవన్​ క్యురేటివ్​ పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ
Follow us

|

Updated on: Mar 02, 2020 | 8:19 AM

నిర్భయ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నాలుగో దోషి పవన్​ గుప్తా క్యురేటివ్​ పిటిషన్​పై నేడు విచారణ చేపట్టనుంది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. ఇంకా దోషుల పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున మార్చి 3న ఉరి అమలుపై సందిగ్ధం నెలకొంది.

నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా క్యురేటివ్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించనుంది.తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్‌ కుమార్‌ గుప్తా పిటిషన్ దాఖలు చేశాడు. అటు డెత్ వారెంట్ల అమలుపై స్టే కోరుతూ పవన్ కుమార్‌తో సహా మరో దోషి అక్షయ్ సింగ్ శనివారం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తిహార్ జైలు అధికారులకు ట్రయల్ కోర్టు నోటీసు జారీచేసింది. సోమవారం నాటికి తమ స్పందన తెలియజేయాలని అధికారులను ఆదేశించింది.

నిర్భయ దోషులు ముకేశ్​, వినయ్​, అక్షయ్​ ఇదివరకే క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయగా రాష్ట్రపతి తిరస్కరించారు. దీనిని సవాలుచేస్తూ ముకేశ్​, వినయ్​లు సుప్రీం కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం. వీరిరువురూ తమ న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకున్నారు. ఇంకా అక్షయ్​కు క్షమాభిక్ష పిటిషన్​ తిరస్కరణను సవాల్​ చేసే అవకాశముంది. పవన్​ గుప్తా ఇంకా క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో మార్చి 3న నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై అయితే మరోసారి సందిగ్ధం నెలకొంది.