AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోయంబత్తూరులో ‘ ఐసిస్ ‘ కలకలం.. ఎన్ఐఏ తనిఖీలు..

తమిళనాడులోని కోయంబత్తూరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అయిదు చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఐసిస్ కేరళ, తమిళనాడు మోడ్యూల్ కేసుకు సంబంధించి ఎర్నాకుళంలోని ప్రత్యేక కోర్టు వారెంట్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఓ ల్యాప్ టాప్, అయిదు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు, ఒక మెమొరీ కార్డు, 8 సీడీలను, పలు అనుమానాస్పద డాక్యుమెంట్లను అధికారులు ఈ తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నారు. కొంతమంది అనుమానితులను […]

కోయంబత్తూరులో ' ఐసిస్ ' కలకలం.. ఎన్ఐఏ తనిఖీలు..
Pardhasaradhi Peri
|

Updated on: Dec 10, 2019 | 4:22 PM

Share

తమిళనాడులోని కోయంబత్తూరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అయిదు చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఐసిస్ కేరళ, తమిళనాడు మోడ్యూల్ కేసుకు సంబంధించి ఎర్నాకుళంలోని ప్రత్యేక కోర్టు వారెంట్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఓ ల్యాప్ టాప్, అయిదు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు, ఒక మెమొరీ కార్డు, 8 సీడీలను, పలు అనుమానాస్పద డాక్యుమెంట్లను అధికారులు ఈ తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నారు. కొంతమంది అనుమానితులను కూడా అరెస్టు చేశామని, వీరికి ఐసిస్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న విషయమై వీరిని ఇంటరాగేట్ చేస్తున్నామని వారు తెలిపారు. వీరిలో కొందరు శ్రీలంకలోని ఐసిస్, జైషే మహమ్మద్ నాయకుడు జహ్రాన్ హషిమ్ తోను, ఆతని సహచరులతోను సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉన్నట్టు తెలిసిందని వారు పేర్కొన్నారు. ఇలా ఉండగా-ఐసిస్ కేరళ-తమిళనాడు మోడ్యూల్ కేసులో 33 ఏళ్ళ మహమ్మద్ అజారుద్దీన్, 38 ఏళ్ళ షేక్ హిదయతుల్లాలను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు లేవని భావిస్తున్నా.. శ్రీలంక లోని ఈ టెర్రరిస్టులతో అనుమానితులను లింక్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.