ఇంట్లోనే ప్రసవించిన తల్లి.. బిడ్డ చనిపోయిందని బకెట్లో వదిలేసింది.. ఆ తర్వాత
ఒకప్పుడు గర్భీణులు ఎక్కువగా ఇంట్లోనే ప్రసవాలు చేసేవారు. ఆ తర్వాత ఈ కాలంలో ఆసుపత్రిలోనే ప్రసవాలు చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొంతమంది ఇంట్లోనే ప్రసవం చేస్తున్నారు.
ఒకప్పుడు గర్భీణులు ఎక్కువగా ఇంట్లోనే ప్రసవాలు చేసేవారు. ఆ తర్వాత ఈ కాలంలో ఆసుపత్రిలోనే ప్రసవాలు చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొంతమంది ఇంట్లోనే ప్రసవం చేస్తున్నారు. అయితే తాజాగా కేరళలోని ఓ మహిళ తన బిడ్డకు ఇంట్లోనే జన్మనిచ్చి ఆ బిడ్డ చనిపోయిందని భావించింది. కానీ చివరికి ఆ శిశువు బతికే ఉందని తెలియడంతో ఊపిరి పిల్చుకుంది. వివరాల్లోకి వెళ్తే అలప్పుజా జిల్లాలోని చెంగనూర్ లో ఓ మహిళ తన ఇంట్లో బాత్ రూంలోనే ప్రసవించింది. అయితే ఆ శిశువు చనిపోయినట్లు భావించిన ఆ తల్లి బకెట్లో ఆ బిడ్డను వదిలేసింది. ఆ తర్వాత ఆసుపత్రి వచ్చి వైద్యులకు ఈ విషయాన్ని తెలియజేసింది.
దీంతో ఆసుపత్రి వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మహిళ ఇంటికి చేరుకున్న పోలీసులు బకెట్లో ఉన్న ఆ శిశువు బతికే ఉన్నట్లు గుర్తించారు. ఆ బిడ్డను బయటకు తీసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. మొదట చనిపోయిందనుకొని భావించిన తన బిడ్డ బతికే ఉండటంపై తల్లి సంతోషం వ్యక్తం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..