AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto-Taxi Strike: ఢిల్లీలో రెండో రోజుకు చేరిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె.. తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న ప్రయాణికులు

Auto, Taxi Strike in Delhi: పెట్రోలు, డీజిల్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్‌జి) ధరల పెరుగుదలకు నిరసనగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు రెండు రోజులగా సమ్మెలో పాల్గొంటున్నారు.

Auto-Taxi Strike: ఢిల్లీలో రెండో రోజుకు చేరిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె.. తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న ప్రయాణికులు
Auto Taxi Strike
Balaraju Goud
|

Updated on: Apr 19, 2022 | 10:45 AM

Share

Delhi Auto-Taxi Strike:పెట్రోలు, డీజిల్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్‌జి) ధరల పెరుగుదలకు నిరసనగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు రెండు రోజులగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఆటో, ట్యాక్సీ, మినీబస్సు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మంగళవారం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల వద్ద ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అంతకుముందు సోమవారం, ఆటో టాక్సీ యూనియన్ల సమ్మె మిశ్రమ ప్రభావాన్ని చూపింది. అయితే సమ్మె కారణంగా ఉదయం రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు చేరుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఢిల్లీ ట్యాక్సీ ఆటో యూనియన్ కూడా పెట్రోల్ డీజిల్ మరియు CNG ధరల పెరుగుదల కారణంగా ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేసింది. దీని కారణంగా భారతీయ మజ్దూర్ సంఘ్‌కు చెందిన ఢిల్లీ ఆటో అండ్ టాక్సీ అసోసియేషన్ ఏప్రిల్ 18, 19 తేదీలలో ఢిల్లీలో సమ్మెను ప్రకటించింది. ఛార్జీలు పెంచాలనే డిమాండ్‌తో పాటు 16 డిమాండ్లను ఆటో యూనియన్‌ పెట్టింది.

ప్రజా సమస్యల దృష్ట్యా పలు ఆటో టాక్సీ యూనియన్లు సమ్మెను విరమించుకున్నట్లు సమాచారం. తన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతానని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం సకాలంలో ఛార్జీల సవరణను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఢిల్లీ ఆటో, టాక్సీ అసోసియేషన్ సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాయి. సీఎన్‌జీ ధరలపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం కిలోకు రూ.35 సబ్సిడీ అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అంతకుముందు రోజు ఏప్రిల్ 18న ట్రాఫిక్ జామ్ కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ప్రీపెయిడ్ ఆటో బూత్‌లను కూడా మూసివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గంటల తరబడి వాహనాల కోసం ప్రజలు బారులు తీరారు. సమ్మె వల్ల ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడితే, దానికి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం రెండూ బాధ్యత వహించాలని యూనియన్ నేతలు అన్నారు. డిమాండ్‌ను అంగీకరించకుంటే భవిష్యత్తులో కూడా సమ్మె చేస్తామని హెచ్చరించారు.

Read Also….  Prashant Kishor: తడబడుతున్న కాంగ్రెస్ ‘హస్తం’కి ప్రశాంత్ కిషోర్ మద్దతు! 3 రోజుల్లో రెండు సార్లు సోనియా గాంధీతో భేటీ