AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లమెంటులో పోటాపోటీ వ్యూహాలు.. మారిన బలాబలాలు.. మోదీ సర్కార్ పంతం నెగ్గేనా?

దేశంలో మిగతా ప్రాంతాల మాటేమో గాని, రాజధాని ఢిల్లీని మాత్రం గట్టిగానే తాకినట్టుంది ఎల్‌నినో ఫియర్. వాతావరణం వేడెక్కి, ఉరుములు మెరుపులతో తల్లడిల్లుతోంది ఢిల్లీ నగరం. వర్షాకాల సమావేశాల్లో కూడా గరంగరంగా మారింది క్యాపిటల్ సిటీ. సభ లోపలే కాదు, ఢిల్లీ వీధులు కూడా గరం మీదున్నాయి. ముఖ్యంగా రాహుల్‌ వర్సెస్ మోదీ.. మైండ్‌గేమ్‌తో ఢిల్లీలో హైటెంపరేచర్లు.. 2026 జూలై 20... మోదీ సర్కార్‌కి ఒకరకంగా అండర్‌లైన్ చేసుకోవాల్సిన తారీఖు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చాలా కాలం యాదుండే రోజు కూడా. గత సమావేశాల్లో రాజ్యాంగసవరణ కోసం చేసిన తీర్మానం వీగిపోయి సభాముఖంగా తొలిసారి తలదించుకున్న ఎన్‌డీఏ ప్రభుత్వం, మళ్లీ ఈ సెషన్‌లోనే తలెత్తుకు నిలబడిన రోజు. ఉభయ సభల్లోనూ బలగం పెంచుకుని రెట్టించిన ఉత్సాహంతో పెర్ఫామ్ చేయాలని డిసైడైంది కూడా ఈరోజే. కానీ, మోదీ టీమ్ ఎంత గొప్ప కాన్ఫిడెన్స్‌తో సభకు వచ్చిందో, అంతకంటే ఎక్కువగా కాంట్రవర్సీలే రిజిస్టర్ అయ్యాయి. సభ లోపలా, వెలుపలా బిగ్ అండ్ బిగ్గర్ క్వశ్చన్‌ మార్కులు ఎదురయ్యాయి. దీటుగా ఢీకొని, వింటర్ సెషన్ మొత్తాన్ని ఇదే టెంపోతో కంటిన్యూ చేయాలన్నది ఎన్‌డీఏ సంకల్పం. కానీ, ఆగస్ట్ 13 వరకూ మొత్తం 19 వర్కింగ్‌డేస్‌లో జరిగే పార్లమెంటు వానాకాలం సమావేశాల్లో ఇంకా ఎన్నెన్ని ఉరుములు, మెరుపులు? వాతావరణం ఎన్ని వంకర్లు తిరుగుతుంది..? జంతర్‌మంతర్‌ పరిసరాల్లో టెన్షన్‌ఫ్రీ ఎట్మాస్ఫియర్ ఎప్పటికి క్రియేటౌతుంది? వాడీవేడిగా ఢిల్లీ ఫైల్స్..

పార్లమెంటులో పోటాపోటీ వ్యూహాలు.. మారిన బలాబలాలు.. మోదీ సర్కార్ పంతం నెగ్గేనా?
Delhi Protest
Balaraju Goud
|

Updated on: Jul 21, 2026 | 9:40 PM

Share

ఇప్పుడు యంగిస్థాన్ చుట్టూ చక్కర్లు కొడుతోంది దేశంలో రాజకీయం. ముఖ్యంగా కాక్రోచ్‌ జనతా పార్టీ పుట్టుక, ఢిల్లీని కాక్రోచ్‌లు వణికిస్తున్న తీరు.. మొత్తం ఎపిసోడ్‌ని ఓరకంట గమనిస్తూ కౌంటర్‌ఫైట్‌కి సిద్ధమవుతోంది మోదీ సర్కార్. కానీ, ఇక్కడే ఇంట్రస్టింగ్ టర్న్ ఏంటంటే, కాక్రోచ్‌ మూమెంట్‌ హైజాకై మొత్తం దృశ్యం హస్తం పార్టీ గుప్పిట్లోకి చేరడం. తనదైన సొంత స్టయిల్‌షీట్‌తో పార్లమెంటు మన్సూన్ సెషన్స్‌కి కిక్‌స్టార్ట్ ఇవ్వబోయారు ప్రధాని మోదీ. ఏరోస్పేస్ ప్రయోగాల్ని విజయవంతం చేసిన స్కైరూట్ అనే స్టార్టప్ కంపెనీ గురించి చెబుతూ, అందులో వర్క్‌ఫోర్స్ సరాసరి వయసు 28 ఏళ్లేనంటూ.. రాహుల్‌నుద్దేశించి ఈరకంగా సెటైరేశారు ప్రధాని మోదీ. నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్టాడ్డం లేదు అన్నప్పుడు మోదీ మార్క్ ఆఫ్ వ్యంగ్యం అండ్ వెటకారం ఇప్పటికీ సోషల్ మీడియాలో రీసౌండ్ ఇస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో రాబోయే రోజులు ఎంత స్పైసీగా ఉండబోతాయో ఇలా హింట్ ఇచ్చేశారు మోదీ. మీరేమీ తుఫాన్లు సృష్టించడానికి పార్లమెంటుకు రానవసరం లేదని అపోజిషన్‌కు స్వీట్‌గా ఓ వార్నింగ్ కూడా జారీ చేశారు. ఆవిధంగా వెదర్‌ని కూల్‌కూల్ చేద్దామని మోదీ ఆశిస్తే ఆశించారు గానీ, సభలోపల వెదర్ రిపోర్ట్ మాత్రం వేరేలా ఉంది. హై టెంపరేచర్స్‌తో రచ్చరచ్చగా మొదలైంది వింటర్ సెషన్. ప్రాధాన్య క్రమంలో బిల్లులు ప్రవేశపెట్టాలని అధికారపక్షం సీరియస్‌గా ట్రై చేసినా, అపోజిషన్‌లో మాత్రం ఆ ఓపిక-సహనం మచ్చుకైనా కనిపించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ఆర్డినెన్స్‌ను గందరగోళం...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి