AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ

52 ఏళ్ల ప్రియాంక గాంధీ.. రాజీవ్‌గాంధీ కూతురిగా కాంగ్రెస్ పార్టీ ఐకాన్‌లలో ఒకరుగా.. ఇందిరాగాంధీ పోలీకలున్న నాయకురాలిగా దేశ రాజకీయాల్ని పరోక్షంగా ప్రభావితం చేశారు. కానీ.. దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ.. ఐదేళ్ల కిందటే యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌ ఈస్ట్ రీజియన్ ఇన్‌‌చార్జిగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు.

1989లో అమేథిలో తండ్రి రాజీవ్‌గాంధీ తరఫున ప్రచారం చేశారు. 1999లో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. 2009లో సుల్తాన్‌పూర్‌ సీటు నుంచి పోటీచేస్తారన్న ప్రచారం జరిగింది. 2014లో మోదీ హవాను ఢీకొట్టేందుకు ప్రియాంకాగాంధీని అరంగేట్రం చేయించేందుకు కాంగ్రెస్‌లో ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నించింది. 2017లో కాంగ్రెస్‌ వ్యూహకర్తగా వచ్చిన ప్రశాంత్‌కిషోర్.. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావల్సిందే అని పట్టుబట్టారు. 2019లో ఏఐసీసీ జెనరల్ సెక్రటరీగా పార్టీ క్లోజ్‌ సర్క్యూట్‌లోకి వచ్చారు. కానీ.. ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. ఇన్ని మలుపుల్లోనూ దూరంగానే నిలబడ్డ ప్రియాంక.. ఇప్పుడు వయనాడు ఉపఎన్నిక సమయానికి ఓట్ల పోటీకి రెడీ చెప్పేశారు.

ఇంకా చదవండి

పార్లమెంటులో పోటాపోటీ వ్యూహాలు.. మారిన బలాబలాలు.. మోదీ సర్కార్ పంతం నెగ్గేనా?

దేశంలో మిగతా ప్రాంతాల మాటేమో గాని, రాజధాని ఢిల్లీని మాత్రం గట్టిగానే తాకినట్టుంది ఎల్‌నినో ఫియర్. వాతావరణం వేడెక్కి, ఉరుములు మెరుపులతో తల్లడిల్లుతోంది ఢిల్లీ నగరం. వర్షాకాల సమావేశాల్లో కూడా గరంగరంగా మారింది క్యాపిటల్ సిటీ. సభ లోపలే కాదు, ఢిల్లీ వీధులు కూడా గరం మీదున్నాయి. ముఖ్యంగా రాహుల్‌ వర్సెస్ మోదీ.. మైండ్‌గేమ్‌తో ఢిల్లీలో హైటెంపరేచర్లు.. 2026 జూలై 20... మోదీ సర్కార్‌కి ఒకరకంగా అండర్‌లైన్ చేసుకోవాల్సిన తారీఖు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చాలా కాలం యాదుండే రోజు కూడా. గత సమావేశాల్లో రాజ్యాంగసవరణ కోసం చేసిన తీర్మానం వీగిపోయి సభాముఖంగా తొలిసారి తలదించుకున్న ఎన్‌డీఏ ప్రభుత్వం, మళ్లీ ఈ సెషన్‌లోనే తలెత్తుకు నిలబడిన రోజు. ఉభయ సభల్లోనూ బలగం పెంచుకుని రెట్టించిన ఉత్సాహంతో పెర్ఫామ్ చేయాలని డిసైడైంది కూడా ఈరోజే. కానీ, మోదీ టీమ్ ఎంత గొప్ప కాన్ఫిడెన్స్‌తో సభకు వచ్చిందో, అంతకంటే ఎక్కువగా కాంట్రవర్సీలే రిజిస్టర్ అయ్యాయి. సభ లోపలా, వెలుపలా బిగ్ అండ్ బిగ్గర్ క్వశ్చన్‌ మార్కులు ఎదురయ్యాయి. దీటుగా ఢీకొని, వింటర్ సెషన్ మొత్తాన్ని ఇదే టెంపోతో కంటిన్యూ చేయాలన్నది ఎన్‌డీఏ సంకల్పం. కానీ, ఆగస్ట్ 13 వరకూ మొత్తం 19 వర్కింగ్‌డేస్‌లో జరిగే పార్లమెంటు వానాకాలం సమావేశాల్లో ఇంకా ఎన్నెన్ని ఉరుములు, మెరుపులు? వాతావరణం ఎన్ని వంకర్లు తిరుగుతుంది..? జంతర్‌మంతర్‌ పరిసరాల్లో టెన్షన్‌ఫ్రీ ఎట్మాస్ఫియర్ ఎప్పటికి క్రియేటౌతుంది? వాడీవేడిగా ఢిల్లీ ఫైల్స్..

మూడు బిల్లులు.. ఒకటే సంకల్పం.. కోటా లెక్కపై పీటముడి..!

2026 ఏప్రిల్ 16.. ఈ తేదీ చానాకాలం యాదుంటది. రాబాయే రెండుమూడు తరాలు బరాబర్ మాట్లాడుకుంటాయి.. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ పార్టీల తలరాతను డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన రెండు నిర్ణయాలకు మోదీ సర్కార్ పెట్టిన ముహూర్తం ఇది. మొదటిది, లోక్‌సభలో సీట్ల పెంపు, ఆ పెంచిన సీట్లలో మహిళలకు ప్రత్యేక కోటా కేటాయింపు. రెంటికి రెండూ హిస్టరీని బ్రేక్ చేసే నిర్ణయాలే. కానీ, ఈ రెండింటికీ ముడిపెట్టి, ఒకటే గాటనకట్టి, చర్చిద్దాం, ఓటేసి ఆమోదించుకుందాం అనడమే, విపక్షానికి రుచించడం లేదు. ఆ సంఘర్షణకే అద్దం పెట్టింది పార్లమెంట్ స్పెషల్ సెషన్. మరి, ధిక్కరించిందెవరు.. గట్టిగా తిప్పికొట్టిందెవరు? ఎవరి వాదనలో ఎంత పస..? హీరో ఆఫ్ ది డేవన్ ఎవరు..?

మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం.. డీలిమిటేషన్‌పై అనుమానాలు!

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేదికగా ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఈ బిల్లులోని చిక్కుముడులను ప్రశ్నించారు. మహిళలకు రావాల్సిన న్యాయాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆమె ఆరోపించారు.

నానమ్మ ఇందిర లుక్‌లో కనిపించిన ప్రియాంక గాంధీ! ప్రత్యేక కేరళ చీర ధరించి, ఎంపీగా ప్రమాణ స్వీకారం

ప్రియాంక కేరళ కాటన్ జారీ చీర ధరించి కట్టుబొట్టుతో అక్కడి సంస్కృతి ప్రతిభించేలా లోక్‌సభకు హాజరయ్యారు.

Elections-2024: ముగిసిన ప్రచారం.. వయనాడ్‌ సహా దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు రేపే పోలింగ్‌!

సోమవారం సాయంత్రం ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రెండు చోట్లా నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాయనాడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.