AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharad Pawar: నాకు వారి నుంచి ప్రేమ లేఖ వచ్చింది.. టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులపై శరద్ పవార్ సెటైర్లు..

సీఎంగా షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు గడవకముందే ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు జారీ చేసింది. పవార్‌ ఎన్నికల అఫిడివిట్‌లో పొందుపర్చిన ఆస్తులు, ఆదాయంపై ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. శరద్‌ పవార్‌కు నోటీసుల జారీ..

Sharad Pawar: నాకు వారి నుంచి ప్రేమ లేఖ వచ్చింది.. టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులపై శరద్ పవార్ సెటైర్లు..
NCP Chief Sharad Pawar (File Photo)
Sanjay Kasula
|

Updated on: Jun 30, 2022 | 10:52 PM

Share

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు(Sharad Pawar) ఐటీ షాకిచ్చింది. సీఎంగా షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు గడవకముందే ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు జారీ చేసింది. పవార్‌ ఎన్నికల అఫిడివిట్‌లో పొందుపర్చిన ఆస్తులు, ఆదాయంపై ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. శరద్‌ పవార్‌కు నోటీసుల జారీ మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ఏక్‌నాథ్‌ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే పవార్‌కు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మొన్నటిదాకా బీజేపీ నేతలపై ఉద్ధవ్‌ ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ఉద్ధవ్‌ కక్షసాధింపులకు కౌంటర్‌ ఎటాక్‌ అప్పుడే మొదలైనట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి రియాక్షన్‌ షురూవైందన్న చర్చ సాగుతోంది. మరోవైపు.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన షిండే అప్పుడే తన పని మొదలుపెట్టారు. మొదటి రోజు సెక్రటరియేట్‌కు వెళ్లారు షిండే. ఆ తర్వాత శరద్ పవార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఆదాయపు పన్ను నోటీసు వచ్చిందని చెప్పారు. పుణెలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘నాకు లవ్ లెటర్ వచ్చింది.. ఇన్‌కమ్ ట్యాక్స్ లవ్ లెటర్… 2004, 2009, 2014, 2020 ఎన్నికల్లో పోటీ చేసిన అఫిడవిట్‌లకు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు పంపింది. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు.

ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రి పదవిపై..

ఈరోజు ఢిల్లీ అదృశ్య హస్తం మరోసారి ఎలా పని చేస్తుందో ఉపముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అంగీకరించాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. బహుశా అలా చేయకూడదు అని శరద్ పవార్ అన్నారు.

జాతీయ వార్తలు