AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: నాసిక్-షిర్డీ హైవే ప్రమాదంపై స్పందించిన రాష్ట్రపతి, ప్రధాని.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..

జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషాదం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు,గాయపడిన బాధితులకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Maharashtra: నాసిక్-షిర్డీ హైవే ప్రమాదంపై స్పందించిన రాష్ట్రపతి, ప్రధాని.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..
Nashik Shirdi Highway Accid
Jyothi Gadda
|

Updated on: Jan 13, 2023 | 6:32 PM

Share

సంక్రాంతి పండగకు ఒక రోజు ముందుగా మహారాష్ట్రలో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన 10 మందిలో ఐదుగురు మహిళలు కాగా, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ప్రయాణికులందరినీ నాసిక్ జిల్లా ఆసుపత్రి, ఒక ప్రైవేట్ ఆసుపత్రి, సిన్నార్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పతారే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో ఉన్న చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 50 మంది ప్రయాణికులు థానే నుంచి బస్సు ఎక్కారు. ఉల్లాస్‌నగర్‌ నుంచి సాయి దర్శనానికి బయలుదేరిన 15 బస్సుల్లో ఇదొకటి అని పోలీసులు తెలిపారు. బస్సు సిన్నార్-షిర్డీ స్టేట్ ఫ్రీవే గుండా షిర్డీకి వెళుతుండగా ఉదయం 7 గంటలకు ప్రమాదం జరిగింది. చనిపోయిన 10 మందిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని, గాయపడిన 30 మందిని నాసిక్ జిల్లా ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి, సిన్నార్ ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషాదం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 200,000, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

బస్సు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్