Maharashtra: నాసిక్-షిర్డీ హైవే ప్రమాదంపై స్పందించిన రాష్ట్రపతి, ప్రధాని.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..

జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషాదం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు,గాయపడిన బాధితులకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Maharashtra: నాసిక్-షిర్డీ హైవే ప్రమాదంపై స్పందించిన రాష్ట్రపతి, ప్రధాని.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..
Nashik Shirdi Highway Accid
Follow us

|

Updated on: Jan 13, 2023 | 6:32 PM

సంక్రాంతి పండగకు ఒక రోజు ముందుగా మహారాష్ట్రలో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన 10 మందిలో ఐదుగురు మహిళలు కాగా, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ప్రయాణికులందరినీ నాసిక్ జిల్లా ఆసుపత్రి, ఒక ప్రైవేట్ ఆసుపత్రి, సిన్నార్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పతారే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో ఉన్న చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 50 మంది ప్రయాణికులు థానే నుంచి బస్సు ఎక్కారు. ఉల్లాస్‌నగర్‌ నుంచి సాయి దర్శనానికి బయలుదేరిన 15 బస్సుల్లో ఇదొకటి అని పోలీసులు తెలిపారు. బస్సు సిన్నార్-షిర్డీ స్టేట్ ఫ్రీవే గుండా షిర్డీకి వెళుతుండగా ఉదయం 7 గంటలకు ప్రమాదం జరిగింది. చనిపోయిన 10 మందిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని, గాయపడిన 30 మందిని నాసిక్ జిల్లా ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి, సిన్నార్ ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషాదం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 200,000, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

బస్సు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..