Nilamben Parikh: మహాత్మ గాంధీ ముని మనవరాలు కన్నుమూత.. అంత్యక్రియలు ఎక్కడంటే..

తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. నీలాంబెన్ పారిఖ్ నిజమైన గాంధేయవాది. ఆమె తన జీవితమంతా కరుణ, సేవ, సమాజ అభ్యున్నతికి అంకితం చేసింది. నీలం బెన్ మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ వారసురాలు. తన తల్లి రామిబెన్, తండ్రి యోగేంద్రభాయ్ పారిఖ్ నుండి పొందిన విలువలతో ప్రభావితమై, తన బాల్యం నుండే తన జీవితంలో గాంధేయ సూత్రాలను స్వీకరించారు..

Nilamben Parikh: మహాత్మ గాంధీ ముని మనవరాలు కన్నుమూత.. అంత్యక్రియలు ఎక్కడంటే..
Neelam Ben Passes Away

Updated on: Apr 02, 2025 | 1:08 PM

మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలం బెన్ పారిఖ్ మరణించారు. ఆయన నవ్‌సరిలో తుది శ్వాస విడిచారు. నీలాంబెన్ మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ మనవరాలు. 93ఏళ్ల నీలం బెన్‌ నవ్‌సరి జిల్లాలోని అల్కా సొసైటీలో తన కుమారుడు డాక్టర్ సమీర్ పారిఖ్ ఇంట్లో నివసిస్తున్నారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. నీలాంబెన్ పారిఖ్ నిజమైన గాంధేయవాది. ఆమె తన జీవితమంతా కరుణ, సేవ, సమాజ అభ్యున్నతికి అంకితం చేసింది. నీలం బెన్ మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ వారసురాలు. తన తల్లి రామిబెన్, తండ్రి యోగేంద్రభాయ్ పారిఖ్ నుండి పొందిన విలువలతో ప్రభావితమై, తన బాల్యం నుండే తన జీవితంలో గాంధేయ సూత్రాలను స్వీకరించారు..

మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ సత్యం, అహింసా మార్గాన్ని అనుసరించినట్లే, నీలాంబెన్ కూడా తన జీవితాన్ని అదే విధంగా గడిపింది. మహిళా సంక్షేమం, మానవ సేవలో నిరంతరం పనిచేశారు. ఆమె తన జీవితాన్ని గాంధీ సూత్రాలను పాటిస్తూ గడిపారు. ఆమె అనేక సామాజిక సంస్థలతో కలిసి చురుగ్గా పనిచేసేవారు. మహిళా విద్య, స్వావలంబన, మహిళల ఆరోగ్యం పట్ల గణనీయమైన కృషి చేశారు.

నీలం బెన్ అంతిమ యాత్ర ఏప్రిల్ 2న ఉదయం 8 గంటలకు ఆమె కుమారుడు డాక్టర్ సమీర్ పారిఖ్ ఇంటి నుండి ప్రారంభమై వెరావల్ శ్మశానవాటిక వరకు సాగింది. ఆమె మరణంతో సమాజం నిజమైన, నిస్వార్థ సేవా దృక్పథం కలిగిన వ్యక్తిని కోల్పోయిందని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us