AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీట్ వివాదం మరవక ముందే.. ‘టెట్’ షాక్.. 24 గంటల ముందే పేపర్ లీక్.. పరీక్ష వాయిదా!

మహారాష్ట్రలో ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (TET) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కలకలం రేపింది. నీట్ (NEET) పరీక్ష వివాదం సద్దుమణగక ముందే, జూన్ 28, 2026న జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ లీక్ అవ్వడం విద్యాశాఖ పనితీరును మరోసారి ప్రశ్నార్థకం చేసింది. పరీక్షకు కేవలం 24 గంటల ముందు ఈ లీక్ వ్యవహారం బయటపడటంతో అధికారులు పరీక్షను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నీట్ వివాదం మరవక ముందే.. ‘టెట్’ షాక్.. 24 గంటల ముందే పేపర్ లీక్.. పరీక్ష వాయిదా!
Teachers Eligibility Test
Balaraju Goud
|

Updated on: Jun 27, 2026 | 3:00 PM

Share

మహారాష్ట్రలో ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (TET) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కలకలం రేపింది. నీట్ (NEET) పరీక్ష వివాదం సద్దుమణగక ముందే, జూన్ 28, 2026న జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ లీక్ అవ్వడం విద్యాశాఖ పనితీరును మరోసారి ప్రశ్నార్థకం చేసింది. పరీక్షకు కేవలం 24 గంటల ముందు ఈ లీక్ వ్యవహారం బయటపడటంతో అధికారులు పరీక్షను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

థానే జిల్లాలోని భివండి పోలీసులు శనివారం (జూన్ 27) ఉదయం నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో కొంతమంది వ్యక్తుల వద్ద టెట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు లభ్యమయ్యాయి. పూణేలోని మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (MSCE) అధికారులు ఈ ప్రశ్నలను అసలు ప్రశ్నపత్రంతో సరిపోల్చగా, అవి నిజమైనవేనని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో భివండి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా 1,028 కేంద్రాలలో దాదాపు 4,28,000 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. పరీక్షను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే తమ ప్రాధాన్యత అని MSCE బోర్డు తెలిపింది. సమగ్ర విచారణ ముగిసే వరకు జూన్ 28 నాటి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో 2025లో కొల్హాపూర్‌లో కూడా ఇలాగే టెట్ పేపర్ లీక్ కావడం గమనార్హం. వరుస లీకేజీలతో కాబోయే ఉపాధ్యాయుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.

లీకేజీకి కారణమైన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో వ్యవస్థలోని అంతర్గత సభ్యుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. త్వరలోనే లీకేజీ సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు అధైర్యపడకుండా అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాలని బోర్డు సూచించింది. రాబోయే రోజుల్లో కొత్త పరీక్ష తేదీని మరియు ఇతర తాజా సమాచారాన్ని మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో సమగ్రంగా ప్రకటిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us