AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గతంలో మహేష్ బాబు, సల్మాన్‌ ఖాన్‌కు నోటీసులు ఇచ్చిన అధికారి.. తాజాగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై సంచలన వ్యాఖ్యలు..!

ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. 'ది కాశ్మీర్ ఫైల్స్'పై స్టేట్‌మెంట్ ఇచ్చి కష్టాలు తెచ్చుకున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది.

గతంలో మహేష్ బాబు, సల్మాన్‌ ఖాన్‌కు నోటీసులు ఇచ్చిన అధికారి.. తాజాగా 'ది కాశ్మీర్ ఫైల్స్'పై సంచలన వ్యాఖ్యలు..!
Ias Officer Niyaz Khan
Balaraju Goud
|

Updated on: Mar 25, 2022 | 12:19 PM

Share

IAS Officer Niyaz Khan: ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్'(The Kashmir Files)పై స్టేట్‌మెంట్ ఇచ్చి కష్టాలు తెచ్చుకున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలను విద్వేషపూరితంగా అభివర్ణిస్తూ, అఖిల భారత సివిల్ సర్వీస్ ప్రవర్తనా నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొంది. దీనిపై నియాజ్ ఖాన్ స్వయంగా సమాచారం ఇస్తూ.. తనకు ఏడు రోజుల సమయం ఇచ్చారని చెప్పారు. నియాజ్ ఖాన్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా పలుమార్లు వివాదాల్లో ఇరుక్కుని నేరుగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాడు.

అసలు వివాదానికి కారణం..

నియాజ్ ఖాన్ మధ్యప్రదేశ్‌లో PWD డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. గత వారం, ది కాశ్మీర్ ఫైల్స్‌కు సంబంధించి ఒక ట్వీట్‌ చేస్తూ.. ఇలా వ్రాశాడు కాశ్మీర్ ఫైల్స్ బ్రాహ్మణుల బాధను గొప్పగా చూపించారు. వారిని అన్ని గౌరవాలతో కాశ్మీర్‌లో సురక్షితంగా ఉండేందుకు అనుమతించాలి. అయితే, పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ముస్లింలు హత్యకు గురవుతున్నారంటూ.. నిర్మాత వీటిపైన కూడా సినిమా తీయాలని పేర్కొన్నారు. అంతటి ఆగలేదు.. అతను రెండవ ట్వీట్ కూడా చేశాడు. అందులో చిత్ర విజయానికి చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని అభినందిస్తూ.. కాశ్మీరీ బ్రాహ్మణుల మనోభావాలకు ప్రజలు చాలా గౌరవం ఇచ్చారు. కాబట్టి, సినిమా నిర్మాతలు ఈ చిత్రానికి వచ్చిన పూర్తి ఆదాయాన్ని బ్రాహ్మణ పిల్లలకు దానం చేయాలన్నారు. అలాగే కాశ్మీర్‌లో వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

నియాజ్ ఖాన్ ఎవరు

నియాజ్ ఖాన్ ఛత్తీస్‌గఢ్ నివాసి. 2001లో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయ్యారు. 2015లో ఐఏఎస్‌లో ప్రమోషన్‌ వచ్చింది. మొదటి పోస్టింగ్ 2002లో రైసెన్‌లోని మండిదీప్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉంది. అక్కడి నుంచి అనేక ప్రధాన చర్యలు చేపట్టి అనేకసార్లు నేరుగా ప్రభుత్వంతో ఢీకొన్నారు. నియాజ్ ఖాన్ 20 ఏళ్ల ఉద్యోగంలో 19 బదిలీలు జరిగాయి. గుణ అదనపు కలెక్టర్‌గా ఉంటూనే జిల్లా పంచాయతీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నియాజ్ ఖాన్.. దేశంలోనే అతిపెద్ద ఓడీఎఫ్ స్కామ్‌ను బయటపెట్టారు. 2006 07లో నియాజ్‌ఖాన్‌ను హోషంగాబాద్‌లో నియమించినప్పుడు, పచ్‌మరిలో అక్రమ నిర్మాణాలలను తొలగించడానికి మొదటిసారిగా బుల్‌డోజర్‌లను ఉపయోగించారు. రచయిత అరుంధతీ రాయ్ భర్త, సినీ నిర్మాత విక్రమ్ భట్ సోదరి ప్రదీప్ కిషన్ బంగ్లాపై ఉన్న ఆక్రమణ తొలగించారు. గ్వాలియర్‌లో విద్యాశాఖకు చెందిన రూ.10 కోట్ల విలువైన భూమి అక్రమ ఆక్రమణల నుంచి విముక్తి పొందింది. 12 గంటల పాటు నిరంతరాయంగా ప్రచారం నిర్వహించి 600లకు పైగా ఆక్రమణలను తొలగించారు. రత్లాంలో విధులు నిర్వహిస్తూ పాఠశాలల నిర్మాణ పనుల్లో పెద్ద కుంభకోణానికి తెరతీశారు.

మహేష్ బాబు, సల్మాన్ ఖాన్‌కు నోటీసులు

అంతేకాదు, 2015లో గుణాలో ఏడీఎంగా నియాజ్‌ఖాన్‌ను నియమించారు. ఆ సమయంలో, గుణకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ శీతల పానీయం థమ్సప్ నమూనాను పరీక్ష కోసం భోపాల్ ప్రభుత్వ లాబొరేటరీకి పంపింది. నమూనాను పరిశీలించిన తర్వాత, థమ్స్ అప్ బాటిల్‌పై రుచి సమాచారాన్ని ముద్రించలేదని, ఇది పానీయాల ప్రమాణాలను ఉల్లంఘించిందని నిర్థారించారు. ఈ విషయం ఎడిఎం కోర్టుకు చేరడంతో, కంపెనీ నామినీలు రాజ్‌కుమార్ తింకర్ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ ఎంపీ అనిత్ కుమార్ పాల్, క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ గుజరాత్‌లోని రుథియా అగర్వాల్ ట్రేడర్స్‌కు చెందిన అనిల్ అగర్వాల్‌లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో థమ్సప్‌ను ప్రమోట్ చేసినందుకు బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబులకు నియాజ్ ఖాన్ నోటీసులు అందించాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తరపున కోర్టులో రిప్లై వచ్చింది. దీని తర్వాత నియాజ్ ఖాన్ చాలాకాలం పాటు హెడ్‌లైన్స్‌లో నిలిచాడు.

Read Also….  Viral Video: అర్డర్ చేసిన ఫుడ్‌ను ఎంచక్కా లాగించేసిన డెలివరీ బాయ్.. అదెలా బయటపడిందంటే..?