AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivraj Singh Chouhan: బీజేపీలో శివరాజ్‌కు కీలక బాధ్యతలు.. బంజరు భూమిలో కమలం వికసించేనా..!

భారతీయ జనతా పార్టీ తదుపరి లక్ష్యం లోక్‌సభ 2024 ఎన్నికలు. దీని కోసం అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. ఒకవైపు ఉత్తర భారతంలో మోడీ మ్యాజిక్ గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు దక్షిణ భారతదేశంలో పాగా వేయడమే పెద్ద టాస్క్‌గా పెట్టుకుంది. దీని బాధ్యత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అప్పగించింది.

Shivraj Singh Chouhan: బీజేపీలో శివరాజ్‌కు కీలక బాధ్యతలు.. బంజరు భూమిలో కమలం వికసించేనా..!
Jp Nadda, Shivraj Singh Chouhan
Balaraju Goud
|

Updated on: Dec 20, 2023 | 3:56 PM

Share

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో గడవు కంటే ముందే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. నెల రోజుల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయంతో జోరు మీదున్న బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని భావిస్తోంది. ఫిబ్రవరి నెల 20వతేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, మార్చి 7 నుంచి పది దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

అయితే భారతీయ జనతా పార్టీ తదుపరి లక్ష్యం లోక్‌సభ 2024 ఎన్నికలు. దీని కోసం అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. ఒకవైపు ఉత్తర భారతంలో మోడీ మ్యాజిక్ గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు దక్షిణ భారతదేశంలో పాగా వేయడమే పెద్ద టాస్క్‌గా పెట్టుకుంది. దీని బాధ్యత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై పడనున్నట్లు తెలుస్తోంది. శివరాజ్ తన ఇష్టానుసారం ఇక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు.

దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర బాధ్యతను పార్టీ తనకు అప్పగిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల వైపు అడుగులు వేస్తామన్నారు. నిజానికి, ఇక్కడ బీజేపీకి ఇది బంజరు భూమిలో కమలం వికసించినట్లే..! ఎందుకంటే చాలా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఉన్న కర్ణాటకను సైతం కాంగ్రెస్ చేతిలోకి లాగేసుకుంది. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ను ఓడించి తెలంగాణను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. లోక్‌సభకు కర్ణాటకలో 28, తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. మొత్తం 45 స్థానాల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది.

దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 131 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో ఒక్కో సీటు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 25, తమిళనాడులో 39, కేరళలో 20 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 131 స్థానాల్లో బీజేపీకి 30, కాంగ్రెస్‌కు 27 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఆధిక్యంలో ఉన్నాయి. 74 స్థానాలను ప్రాంతీయ పార్టీలే కైవసం చేసుకున్నాయి.

స్వాతంత్ర్యం తరువాత, కాంగ్రెస్ దక్షిణ భారతదేశంలో అభివృద్ధి చెందింది. కానీ కాలక్రమేణా కాంగ్రెస్ మునిగిపోయింది. అప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్‌ను జూనియర్‌ పార్ట్‌నర్‌గా చూసే పరిస్థితి నెలకొంది. తమిళనాడులో డీఎంకేతో పొత్తు ఉంది. అదే సమయంలో బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి ఉంది. గత ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు వచ్చినా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఖాతా తెరవలేదు. మధ్యప్రదేశ్ మామ అనే మంచి పేరు సంపాదించిన శివరాజ్ సింగ్ చౌహాన్ దక్షిణాదికి వెళ్లాలనుకుంటున్నారు.

సీఎం రేసుకు దూరమైన తర్వాత శివరాజ్ స్థాయిని పార్టీ తగ్గించిందని అంటున్నారు. 18 ఏళ్ల క్రితం పార్టీపై ఉన్న మక్కువ ఇప్పుడు కూడా చూపించాలన్నారు. దక్షిణాదిలో, వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా హిందుత్వ, ప్రధాని మోదీ అభివృద్ధి ప్రణాళికలను ప్రదర్శించాలని పార్టీ యోచిస్తోంది. తద్వారా ఓటర్లను దాని వైపు ఆకర్షించుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత శివరాజ్ సింగ్‌ చౌహాన్‌కు దక్షిణ భారత బీజేపీ గెలుపు బాధ్యతలు అప్పగించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…