AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro Rail : మెట్రోలో ప్రయాణీకులకు ఏదైనా ప్రమాదం జరిగితే, ఎంత పరిహారం ఇస్తారు..?

ఢిల్లీ మెట్రోలో ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళ చీరలో కొంత భాగం రైల్ డోర్‌లో ఇరుక్కుపోవడంతో ట్రాక్‌పై ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, 2 రోజులకే మృతి చెందారు. ఇప్పుడు దీనిపై ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ పరిహారం ప్రకటించింది.

Metro Rail : మెట్రోలో ప్రయాణీకులకు ఏదైనా ప్రమాదం జరిగితే, ఎంత పరిహారం ఇస్తారు..?
Delhi Metro
Balaraju Goud
|

Updated on: Dec 20, 2023 | 3:35 PM

Share

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ భారతదేశంలో అతిపెద్ద మెట్రో వ్యవస్థ. ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజు సగటున 50 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా ఢిల్లీ మెట్రోలో ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళ చీరలో కొంత భాగం రైల్ డోర్‌లో ఇరుక్కుపోవడంతో ట్రాక్‌పై ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, 2 రోజులకే మృతి చెందారు. ఇప్పుడు దీనిపై ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ పరిహారం ప్రకటించింది. పరిహారం ఎలా అందుతుంది? పరిహారం నియమాలు ఏమిటి? ఈ వార్తలో తెలుసుకుందాం.

ఢిల్లీ మెట్రోలో పరిహారం నియమాలు

ఢిల్లీలో మెట్రో 2002లో ప్రారంభమైంది. 2002లోనే మెట్రో ప్రారంభంతో నియమ నిబంధనలు కూడా రూపొందించారు. ఈ చట్టాలలో ఒకటి ఢిల్లీ మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 2002. దీని కింద మెట్రోలో పరిహారం కోసం నిబంధన ఉంది. మెట్రో రైళ్ల వల్ల ఎవరైనా మెట్రో స్టేషన్‌లో ప్రమాదానికి గురైతే, ఈ చట్టం ప్రకారం తక్షణమే రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. దీంతో పాటు రూ.5 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చే ప్రస్తావన కూడా ఉంది. అయితే తుది పరిహారం మొత్తాన్ని మెట్రో కమిటీయే నిర్ణయిస్తుంది.

ఇందర్‌లోక్ ప్రమాదంలో రూ. 15 లక్షలు పరిహారం

ఢిల్లీలోని ఇందర్ లోక్ మెట్రో స్టేషన్‌లో చీరలో కొంత భాగం డోర్‌లో ఇరుక్కుని ఓ మహిళ మరణించిన కేసులో ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ పరిహారం ప్రకటించింది. పరిహార చట్టం ప్రకారం నిర్ణీత పరిహారం రూ.5 లక్షల కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాలని ఢిల్లీ మెట్రో నిర్ణయించింది. మహిళ ఇద్దరు చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఈ పరిహారాన్ని రూ.10 లక్షలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ మెట్రో ఇప్పుడు ఆ పిల్లల పేరిట రూ.15 లక్షల మొత్తాన్ని విరాళంగా ఇవ్వనుంది. దీంతో పాటు పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు కూడా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ భరించాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..