AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేటకు వెళ్లిన జాలరి వల బరువెక్కింది.. బోలెడన్ని చేపలు పడ్డాయని సంబరపడ్డాడు.. కానీ అంతకుమించి..

తీరప్రాంతాల్లో నివసించే జాలర్లు చేపల వేటతోనే బ్రతుకు జీవనాన్ని సాగిస్తుంటారు. ప్రతీసారి సముద్రంలోకి వేటకు వెళ్లే ముందు..

వేటకు వెళ్లిన జాలరి వల బరువెక్కింది.. బోలెడన్ని చేపలు పడ్డాయని సంబరపడ్డాడు.. కానీ అంతకుమించి..
Representative Image
Ravi Kiran
|

Updated on: Dec 29, 2022 | 9:28 AM

Share

తీరప్రాంతాల్లో నివసించే జాలర్లు చేపల వేటతోనే బ్రతుకు జీవనాన్ని సాగిస్తుంటారు. ప్రతీసారి సముద్రంలోకి వేటకు వెళ్లే ముందు జాలర్లు గంగమ్మ తల్లిని వేడుకుంటారు. తమ వలలకు బోలెడన్ని చేపలు లేదా అరుదైన జలపుష్పాలు చిక్కాలని కోరుకుంటారు. ఇక గంగమ్మ దయతో పలువురు జాలర్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులైన సందర్భాలు లేకపోలేదు. ఈ కోవలోనే తాజాగా కర్ణాటకలోని జాలర్లకు అదృష్టం వరించింది. ఉడిపి తీర ప్రాంతమైన మల్పే సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఏకంగా రూ. 2 లక్షలు విలువ చేసే అత్యంత ఖరీదైన ఘోల్ చేప చిక్కింది. తొలుత వల భారీగా ఉండటంతో.. బోలెడన్ని చేపలు చిక్కాయేమో అనుకున్నాడు. తీరా వలను బయటికి లాగగానే భారీ బరువున్న ఘోల్ చేపను చూసి ఆశ్చర్యపోయాడు.

22 కిలోల బరువున్న ఈ ఘోల్ చేపను సదరు జాలరి మార్కెట్‌లో రూ.2,34,080కి విక్రయించాడు. ఈ చేపను మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఘోల్ చేపలు సముద్రపు అడుగుభాగంలో ఉంటాయి. అలాగే అరుదుగా పైకి వస్తుంటాయి. ఇవి ఎక్కువగా అరేబియా సముద్రం, శ్రీలంక, ఆస్ట్రేలియా మహాసముద్రాలలో కనిపిస్తాయి. ఘోల్ చేప పొట్టలో ఉండే ప్రత్యేక మోలిక్యుల్ సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. దీనికి విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఒక మీటర్ వరకు పెరిగే ఈ చేపలు సుమారు 30 కిలోల బరువు ఉంటాయి. అలాగే మార్కెట్‌లో రూ. 5 లక్షల వరకు పలుకుతాయి.

మరోవైపు కొన్ని నెలల క్రితం శ్యాంరాజ్ తొట్టంకు చెందిన మత్స్యకారుల వలకు 20 కిలోల బరువున్న ఘోల్ చేపలు చిక్కాయి. మార్కెట్‌లో రూ. 1.90 లక్షలకు విక్రయించారు. అలాగే 2021 సెప్టెంబర్‌లో ఓ మత్స్యకారుడికి 157 ఘోల్ చేపలు చిక్కాయి. వాటిని రూ. 1.33 కోట్లు విక్రయించి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.

Ghol Fish