‘ముంబై వెళ్తున్నా..ఆ గూండాలు నా ఆస్తులపై పడ్డారు’, కంగనా రనౌత్
తాను ఈ రోజు ముంబైకి వెళ్తున్నానని, ఇప్పుడే విమానాశ్రయానికి బయల్దేరానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపింది. (ప్రస్తుతం ఆమె తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నసంగతి తెలిసిందే).
తాను ఈ రోజు ముంబైకి వెళ్తున్నానని, ఇప్పుడే విమానాశ్రయానికి బయల్దేరానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపింది. (ప్రస్తుతం ఆమె తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నసంగతి తెలిసిందే). ముంబైపై చేసిన తన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ఆమెకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద గొడవే కొనసాగుతోంది. ఆమెను ముంబైలో అడుగు పెట్టనివ్వబోమని శివసేన హెచ్చరిస్తుంటే…. ఎట్టి పరిస్థితుల్లోనూవెళ్లి తీరుతానని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కంగనా కూడా సవాల్ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం, గూండాలు ముంబైలో తన ఆస్తులపై విధ్వంసానికి తెగబడ్డారని, కానీ మహారాష్ట్ర కోసం తన రక్తాన్ని ధారపోసేందుకైనా రెడీ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ కూల్చివేత పెద్ద విశేషమేమీ కాదని, తన స్పిరిట్ (స్ఫూర్తి) ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటుందని కంగనా పేర్కొంది.
I am never wrong and my enemies prove again and again this is why my Mumbai is POK now #deathofdemocracy ? pic.twitter.com/bWHyEtz7Qy
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020
Babur and his army ?#deathofdemocracy pic.twitter.com/L5wiUoNqhl
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020