AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైమండ్‌ మాస్కులకు భలే గిరాకీ.. ధర చూస్తే షాక్‌ తినాల్సిందే..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు కరోనా మహమ్మారి సోకకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. అంతేకాదు బయట వెళ్తే ఖచ్చితంగా మాస్క్‌ ధరిస్తున్నారు. అయితే..

డైమండ్‌ మాస్కులకు భలే గిరాకీ.. ధర చూస్తే షాక్‌ తినాల్సిందే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2020 | 7:29 PM

Share

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు కరోనా మహమ్మారి సోకకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. అంతేకాదు బయట వెళ్తే ఖచ్చితంగా మాస్క్‌ ధరిస్తున్నారు. అయితే అంతా నార్మల్‌ మాస్కులు ధరిస్తున్నప్పటికీ.. మన భారతీయులు మాత్రం మాస్కుల్లో కూడా డిజైన్ల మాస్కులు ధరిస్తూ ఇతరులను ఆకర్షించేలా ప్రయత్నిస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి బంగారంతో చేయిచుకున్న మాస్క్‌ను పెట్టుకుని హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరికొందరైతే.. అభిమాన హీరోలకు చెందిన మాస్కులు, మోదీ మాస్కులు.. బ్యాన్ చైనా అన్న స్లోగన్స్‌ ఉన్న మాస్కులను ధరిస్తున్నారు.

అయితే ఇదంతా కామన్ అనుకున్న గుజరాత్ సూరత్ వాసులు.. డైమండ్‌లతో చేసిన మాస్కులను ధరిస్తున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు గోల్డ్ వ్యాపారస్థులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న దుకాణాలకు కస్టమర్లను ఆకర్షించేందుకు వారి క్రియేటివీటిని బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల్ని ఆకర్షించేందుకు వజ్రాలతో తయారు చేసిన మాస్కులను రెడీ చేస్తున్నారు. దీంతో అక్కడి ధనవంతులు వారి హోదాను చూపించేందుకు ఈ డైమండ్‌ మాస్కులను పెట్టకుంటూ సంతోషపడుతున్నారు. మొత్తానికి డైమండ్‌ మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని సూరత్ గోల్డ్ వ్యాపారస్థులు చెబుతున్నారు. అయితే వీటి ధర ఒక్కక్కటి రూ.1.5 లక్ష వరకు ఉన్నాయి. వజ్రాలు ఎప్పటికైనా తిరిగి ఉపయోగించుకోవచ్చన్న ఉద్దేశంతో డైమండ్ మాస్కుల వైపు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారని వ్యాపారస్థులు చెబుతున్నారు.